Kamal Haasan : ముగ్గురు స్టార్ హీరోల మల్టీస్టారర్.. 150 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్..

తాజాగా ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. 'విక్రమ్' సినిమాకు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు 150 కోట్ల రూపాయలు వచ్చినట్లు....

Kamal Haasan : ముగ్గురు స్టార్ హీరోల మల్టీస్టారర్.. 150 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్..

Kamal

 

Kamal Haasan :  ఒక్క స్టార్ హీరో ఉంటేనే ఆ సినిమా 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది. అలాంటిది ముగ్గురు స్టార్ హీరోలంటే ఇక కలెక్షన్ల సునామినే. లోక నాయకుడు కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్ కలిసి ‘విక్రమ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఖైదీ, మాస్టర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన యువ ట్యాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ‘విక్రమ్’ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

‘విక్రమ్’ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి భారీ స్పందన వచ్చింది. ఈ ముగ్గురు స్టార్ హీరోల అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వకముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ‘విక్రమ్’ సినిమాకు కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు 150 కోట్ల రూపాయలు వచ్చినట్లు తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమాకి పెట్టిన పెట్టుబడి ఇప్పటికే వచ్చేసింది అని అంటున్నారు.

Varun Tej : ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఏప్రిల్ వరకు వెయిట్ చేయాల్సిందే

కమల్, విజయ్ సేతుపతి, ఫాహిద్ ఈ ముగ్గురు కలిసి నటిస్తున్న ‘విక్రమ్’ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా దాదాపు 30 కోట్లు వచ్చినట్టు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్ టెలీఫిల్మ్స్ వారు ఈ రైట్స్ ని దక్కించుకున్నారు. అలాగే తమిళ్, తెలుగు, కన్నడ మరియు ఇతర అన్ని భాషల్లో కలిపి స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసింది. అన్ని భాషల ఓటీటీ మరియు శాటిలైట్, యూట్యూబ్ రైట్స్ ద్వారా దాదాపు 100 కోట్ల బిజినెస్ ఆల్రెడీ జరిగిపోయిందని సమాచారం. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

Dhanush-Aishwarya : విడాకుల తర్వాత మొదటిసారి ఎదురుపడ్డ ధనుష్, ఐశ్వర్య.. ఒకే పార్టీలో ఇద్దరూ..

ఇక థియేటర్లలో కూడా ఈజీగా 100 కోట్ల కలెక్షన్ రాబడుతుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉన్న ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. అయితే సమ్మర్ కి పాన్ ఇండియా సినిమాలు ఉండటంతో మరి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మంచి ఫామ్ లో ఉండటంతో ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు అభిమానులు.