Kangana Ranaut : మూవీ మాఫియా అంటూ అలియా సినిమాపై ఫైర్ అయిన కంగనా..
కంగనా వీరిని ఉద్దేశించి కరణ్ జోహార్ను సినిమా మాఫియా డాడీ అని, అలియా భట్ను బింబో అని పిలిచింది. కంగనా తన స్టోరీలో.. ''ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు బూడిదలో పోసిన.........
Kangana Ranaut : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఓ ఫైర్ బ్రాండ్. దేశం గురించి, మహిళల గురించి, తన గురించి అయినా ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా కంగనా ఫైర్ అవుతుంది. ఎవరినైనా సరే, ఎంతటి వారినైనా సరే తన మాటలతో చెడుగుడు ఆడేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఒకపక్క అదిరిపోయే సినిమాలు చేస్తూ మరో పక్క సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ దేశంలో జరిగే విషయాలపైన తన రీతిలో స్పందిస్తుంది. ఎన్నో సార్లు ఎంతోమంది పై భయపడకుండా కామెంట్స్ చేసి ఎప్పుడూ వివాదాల్లో కూడా నిలుస్తుంది. అయినా అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్లిపోతుంది కంగనా.
ఇక బాలీవుడ్ ని కొంతమంది చేతుల్లోనే పెట్టుకున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది స్టార్లు బాలీవుడ్ ని శాశిస్తున్నారని ఇప్పటికే చాలా మంది ఆరోపించారు. ఈ విషయంలో కంగనా కూడా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ ని గతంలోనే విమర్శించింది. తాజాగా మరోసారి బాలీవుడ్ మూవీ మాఫియాపై కంగనా ఫైర్ అయింది. ప్రస్తుతం అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతీయవాడి’ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఈ సందర్భంగా కంగనా ఆలియా భట్ ని, కరణ్ జోహార్ ని, ఈ సినిమాని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టింది.
Prasanna Kumar : ఇండస్ట్రీకి పెద్ద ఎవరూ లేరు.. చిరంజీవి జగన్ కలయిక ఇండస్ట్రీకి సంబంధం లేదు..
కంగనా వీరిని ఉద్దేశించి కరణ్ జోహార్ను సినిమా మాఫియా డాడీ అని, అలియా భట్ను బింబో అని పిలిచింది. కంగనా తన స్టోరీలో.. ”ఈ శుక్రవారం బాక్సాఫీస్ వద్ద 200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఈ సినిమాకి అతి పెద్ద లోపము తప్పు కాస్టింగ్. ఈ పాప అంటే మాఫియా డాడీకి ఇష్టం. ఆ అందమైన మూర్ఖురాలు రొమాంటిక్ కామెడీలో నటించగలదని డాడీ నిరూపించాలని ప్లాన్ చేస్తున్నారు. మూవీ మాఫియా బాలీవుడ్ ను నాశనం చేస్తోంది. అందుకే సౌత్, హాలీవుడ్ సినిమాలు ఇక్కడి థియేటర్లల్లో ఆడుతున్నాయి. ఈ మాఫియా పవర్ లో ఉన్నంత కాలం బాలీవుడ్ పరిస్థితి మారదు” అంటూ ఘోరంగా విమర్శించింది.