Yogi Retorts To Akhilesh : అఖిలేష్ “రామ రాజ్యం”వ్యాఖ్యలకు యోగి కౌంటర్

మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయమంతా శ్రీకృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. శ్రీ కృష్ణుడు ప్రతి రోజూ తన

Yogi Retorts To Akhilesh : అఖిలేష్ “రామ రాజ్యం”వ్యాఖ్యలకు యోగి కౌంటర్

Yogi (1)

Yogi Retorts To Akhilesh : మరికొన్ని వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయమంతా శ్రీకృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. శ్రీ కృష్ణుడు ప్రతి రోజూ తనకలలో వస్తారని.. తాను రోజు ఆయనతో మాట్లాడతానని.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌ వాది పార్టీ గెలుస్తుందని,రామ రాజ్యం నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని కృష్ణుడు తనతో చెప్పాడంటూ అఖిలేష్ యాదవ్ సోమవారం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

కాగా,ఇటీవల బీజేపీ ఎంపీ హర్ నాథ్ సింగ్ పార్టీ అధిష్ఠానానికి రాసిన ఓ లేఖలో..యోగి ఆదిత్యనాథ్ మథుర నుంచి పోటీ చేయాలని రాత్రి తన కలలో ఎవరో చెప్పారని,బహుశా ఆ కృష్ణ భగవానుడే ఈ విషయంలో తనను మధ్యవర్తిత్వం చేయమని ఆదేశించి ఉంటాడని పేర్కొన్నారు. ఈ లేఖ వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ అఖిలేష్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే అఖిలేష్ వ్యాఖ్యలకు సీఎం యోగి కౌంటర్ ఇచ్చారు. కృష్ణుడు వారిని శపిస్తాడంటూ అఖిలేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్. అలీఘర్ లో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో యోగి ఆదిత్యానథ్ మాట్లాడుతూ..కొంతమందికి కృష్ణుడు తప్పకుండా కలలో కనిపిస్తాడు. వారి వైఫల్యాలకు ఇప్పుడైనా దు:ఖించమని చెప్పి ఉంటాడు. అఖిలేష్ యాదవ్ చేయలేనిది బీజేపీ ప్రభుత్వం చేసి చూపిస్తోంది. ఎస్పీ అధికారంలో ఉన్నప్పేడే మథుర,బృందావనం అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నిస్తూ భగవాన్ శ్రీకృష్ణుడు మిమ్మల్ని శపిస్తాడు”అని యోగి వ్యాఖ్యానించారు. కాగా,ఈ ఎన్నికల్లో మథుర నుంచి యోగి ఆదిత్యానాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమున్నట్లు సమాచారం.

ALSO READ Akhilesh yadav: ప్రతీరాత్రి శ్రీ కృష్ణుడు నా కలలోకి వస్తాడు..రామరాజ్యం నెలకొల్పుతానని చెబుతాడు : అఖిలేశ్‌ యాదవ్‌