‘Unsafe Hospital’ :ఆ హాస్పిటల్లో ప్రతీరోజూ 37మం‍ది పసిగుడ్డులు మృతి..దేశ శిశు మరణాలలో 13 శాతం ఇక్కడే..

ఈహాస్పిటల్లో శిశువుల మరణఘోష కొనసాగుతునే ఉంది. ప్రతీరోజూ 37మం‍ది పసిగుడ్డులు మృతి చెందుతున్నారు..దేశ శిశు మరణాలలో 13శాతం ఈ హాస్పిటల్ లోనే ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఊహించుకోవచ్చు

‘Unsafe Hospital’ :ఆ హాస్పిటల్లో ప్రతీరోజూ 37మం‍ది పసిగుడ్డులు మృతి..దేశ శిశు మరణాలలో 13 శాతం ఇక్కడే..

Most 'unsafe Hospital'

Most unsafe hospital : అది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని హమీడియా హాస్పిటల్‌. ఆ హాస్పిటల్ లో శిశువుల మరణమృంగం ఆగటంలేదు. ఐదేళ్లుగా ప్రతీ రోజు సగటున 37మంది శిశువులు చనిపోతున్నారు. ఎంత దారుణమంటే దేశంలోని శిశుమరణాల్లో 13 శాతం ఈ హాస్పిటల్ లోనే జరుగుతోంది. అంటే ఈ హాస్పిటల్ శిశువుల పాలిట మృత్యువుగా మారిన వైనం. ఇలా పసిగుడ్డుల మరణఘోష ఇక్కడ ఎందుకు తయారైంది? దీనికి కారణాలేంటీ? ఇంతటి దారుణ పరిస్థితులపై మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి ఏం చెబుతున్నారంటే..

భోపాల్‌లోని హమీడియా హాస్పిటల్‌లోని స్పెషల్‌ నియోనాటల్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)లో గత ఐదేళ్లలో సగటున దాదాపు 37 మంది శిశువులు మృతిచెందారని ప్రభుత్వమే చెబుతోంది. దేశంలోని మొత్తం శిశు మరణాలలో 13 శాతం మరణాలు ఈ హాస్పిటల్లోనే చోటుచేసుకుంటున్నాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించుకోవచ్చు.

ఈ హాస్పిటల్ లోని ఎస్‌ఎన్‌సీయూ యూనిట్‌లో (2020- 21) లో దాదాపు 5,00,996 నవజాత శిశువులు అడ్మిట్ కాగా..వారిలో 68,301 మంది చనిపోయారు. అలాగే 2019-20 మధ్య 14,759 మంది శిశువులు మరణించారు. అంతేకాదు ఈ యూనిట్‌లో చేరిన చాలా మంది శిశువులు విషమ పరిస్థితిలో ఉన్నారు అంటే అక్కడ నిర్లక్ష్యమనుకోవాలా? మరేమనుకోవాలో అర్థం కాని పరిస్థితి..

మంగళవారం (డిసెంబర్ 21) అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ్యుడు జితు పట్వారీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ఆరోగ్య మంత్రి ప్రభురామ్ చౌదరి శిశు మరణాల డేటాను అందించగా ఈ విషయాలు బయటపడ్డాయి. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతు తమమీద ఎటువంటి తప్పు లేదని సమర్థించుకునే యత్నం చేశారు. ‘‘నెలలు నిండని శిశువులు కూడా హమీడియా ఆసుపత్రిలో చేరారని..అప్పటికే వారి పరిస్థితి బాగుండక మృతి చెందారని చెప్పుకొచ్చారు తప్ప అంతకు మించి ఎటువంటి సమాచారంఇవ్వలేదు.హాస్పిటల్ భద్రతపై కూడా మంత్రి ఏమీ వ్యాఖ్యానించలేదు.

అత్యంత ప్రమాదకర ఆసుపత్రి (Most unsafe hospital)
ఈ శిశు మరణాల డేటాను పరిశీలిస్తే..మధ్యప్రదేశ్‌లోనే హమీడియా హాస్పిటల్‌ అత్యంత ప్రమాదకర ఆసుపత్రి అని శాసనసభ్యుడు జితు పట్వా పట్వారీ వ్యాఖ్యానించారు. ఇది అత్యంత ఆందోళన కలిగించే విషమని..దీనిపై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఆరోగ్య కార్యకర్తలతో పాటు ఇతర వైద్య సిబ్బంది పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని పట్వారీ తెలిపారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా.. 2018 శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే ప్రకారం అత్యధిక శిశు మరణాల రేటులో మధ్యప్రదేశ్‌ ముందంజలో ఉండటం గమనించాల్సిన విషయం. ప్రతి 1000 శిశుజననాలకుగ 48 శిశుమరణాలు సంభవిస్తున్నాయి. భవనాలు కూలిపోవడం, ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాల వంటివాటివల్లకూడా వందలాది మంది శిశువులు మృతి చెందుతున్నారని నివేదిక వెల్లడించింది. 2021 నవంబర్‌లో భోపాల్‌లోని కమ్లా నెహ్రూ చిల్డ్రన్స్ హాస్పిటల్లో సంభవించిన అగ్నిప్రమాదంలో గాయపడిన 40 మంది నవజాత శిశువుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, తర్వాత 48 గంటల్లో మరో పది మంది మరణించిన విషయం తెలిసిందే. ఇలా కారణం ఏదైనా మధ్యప్రదేశ్ లో పసిగుడ్డుల మరణమృదంగం మాత్రం ఆగటంలేదు.దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవరసం చాలా ఉంది. లేదంటే అదే కొనసాగితే తల్లుల కడుపు కోతలకు కారణంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.