Ranji Trophy: సెంచరీ బాది అచ్చం కేఎల్ రాహుల్లా చేసిన యశ్ దుబే.. వీడియో
రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో మూడో రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్మన్ యశ్ దుబే అదరగొట్టాడు. సెంచరీ బాది ప్రత్యర్థి జట్టు ముంబైపై ఒత్తిడి పెంచాడు. శతకం బాదిన వెంటనే యశ్ దుబే మైదానంలో అచ్చం కేఎల్ రాహుల్లా చేశాడు. హెల్మెట్ తీసి కింద పెట్టి నిలబడి, తన రెండు చెవుల్లో చూపుడు వేళ్లు పెట్టాడు.
Ranji Trophy: రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో మూడో రోజు మధ్యప్రదేశ్ బ్యాట్స్మన్ యశ్ దుబే అదరగొట్టాడు. సెంచరీ బాది ప్రత్యర్థి జట్టు ముంబైపై ఒత్తిడి పెంచాడు. శతకం బాదిన వెంటనే యశ్ దుబే మైదానంలో అచ్చం కేఎల్ రాహుల్లా చేశాడు. హెల్మెట్ తీసి కింద పెట్టి నిలబడి, తన రెండు చెవుల్లో చూపుడు వేళ్లు పెట్టాడు. శతకం చేసినందుకు అతడిని అందరూ అభినందించారు.
Presidential election: నామినేషన్ వేసిన ద్రౌపది ముర్ము.. సోనియా, మమత, పవార్కు ఫోన్లు
నిన్న ముంబై బ్యాట్స్మన్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీ బాది భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో మధ్యప్రదేశ్-ముంబై మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కొనసాగుతోంది. నిన్న ముంబై జట్టు 374/9 వద్ద తొలి ఇన్సింగ్స్ను డిక్లేర్ చేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఓపెనర్లు యశ్ దుబే (114), రజాత్ పటీదార్ (9) క్రీజులో ఉన్నారు. మధ్యప్రదేశ్ స్కోరు 278/2 గా ఉంది. ముంబైకి మధ్యప్రదేశ్ గట్టిపోటీ ఇస్తోంది.
That 1⃣0⃣0⃣ Feeling! ? ?
What a fine ? this has been by Yash Dubey in the @Paytm #RanjiTrophy #Final! ? ? #MPvMUM
Follow the match ▶️ https://t.co/xwAZ13U3pP pic.twitter.com/3eqSSmbDfm
— BCCI Domestic (@BCCIdomestic) June 24, 2022