RGV : నాకు 50 వేలు ఇవ్వకుండా ఆర్జీవీ మోసం చేశారు : మహేశ్వరి
ఇటీవల 'ఆలీతో సరదాగా' షోకి గెస్ట్ గా వచ్చిన మహేశ్వరి అనేక ఆసక్తికర విషయాలని పంచుకుంది. ఇందులో భాగంగానే ఆర్జీవీ తనకి 50 వేలు బాకీ ఉన్న సంగతి తెలిపింది. మహేశ్వరి దీని గురించి చెప్తూ..
Maheshwari : 90లలో హీరోయిన్ మహేశ్వరి చేసింది తక్కువ సినిమాలైనా ఫుల్ క్రేజ్ తెచ్చుకొని అభిమానులని సంపాదించుకుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ‘గులాబీ’ సినిమాతో స్టార్ అయింది మహేశ్వరి. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాలోని ‘మేఘాలలో..’,’ఈవేళలో నీవు’.. లాంటి సాంగ్స్ ఇప్పటికి క్లాసిక్ గా నిలిచాయి. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి సినీ పరిశ్రమకు దూరమయింది.
ఇటీవల ‘ఆలీతో సరదాగా’ షోకి గెస్ట్ గా వచ్చిన మహేశ్వరి అనేక ఆసక్తికర విషయాలని పంచుకుంది. ఇందులో భాగంగానే ఆర్జీవీ తనకి 50 వేలు బాకీ ఉన్న సంగతి తెలిపింది. మహేశ్వరి దీని గురించి చెప్తూ.. ”దెయ్యం సినిమా షూటింగ్ మేడ్చల్లోని ఓ పాడుపడ్డ ఫామ్హౌస్లో చేశారు. అక్కడ స్మశానం సెట్ వేశారు. అక్కడి నుంచి మెయిన్ రోడ్కి సుమారు 2 కిలోమాటర్ల దూరం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా పొడవాటి చెట్లతో భయంకరంగా ఉంటుంది. రాత్రి 1గంటకి షూటింగ్. అప్పుడు వర్మ మీలో ఎవరైనా మెయిన్ రోడ్ వరకు వెళ్లొస్తే 50వేలు ఇస్తానని పందెం కట్టారు. నేను వెళ్తా అని చెప్పి భయపడుతూనే వెళ్లి వచ్చాను. కానీ ఆయన ఇస్తానన్న 50వేలు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు.” అని తెలిపారు.
Anchor Shyamala : కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన యాంకర్ శ్యామల
ఇప్పటికి కూడా ఆర్జీవీ ఎక్కడైనా కనపడితే కచ్చితంగా ఆ 50 వేలు అడుగుతాను అని నవ్వుతే చెప్పింది మహేశ్వరి. దీంతో ఆలీ ఆర్జీవిని ఆ డబ్బులు ఇచ్చేయమని లేకపోతే ఇంటికి వచ్చి తీసుకుంటామని నవ్వుతూ టీవీ నుంచే చెప్పారు. అలా మహేశ్వరి తన సినిమాల గురించి, అప్పటి సంఘటనల గురించి ప్రేక్షకులకి తెలియచేసింది.