Metro Trains : గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

గణేశ్ నిమజ్జనాల సందర్భంగా రేపు హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Metro Trains : గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

Metro

Metro trains available till midnight : గణేశ్ నిమజ్జనాల సందర్భంగా రేపు హైదరాబాద్ మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మూడు కారిడార్లలో చివరి రైలు రాత్రి ఒంటి గంటకు బయల్దేరుతుందని పేర్కొన్నారు. చివరి స్టేషన్ కు రాత్రి 2 గంటల వరకు చేరుకుంటుందని చెప్పారు.

మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి- సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా- సికింద్రాబాద్‌, లింగంపల్లి-నాంపల్లి రూట్లల్లో MMTS రైళ్లను నడుపనున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల వరకు ప్రతి మూడు నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లను అన్ని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం నిర్వహించనున్నారు బల్దియా అధికారులు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Tank Bund : గణేష్ నిమజ్జనం, ట్యాంక్ బండ్‌‌పై 40 క్రేన్లు..ప్రత్యేక నిఘా

రేపు హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం జరగనుంది. తొమ్మిది రోజుల పాటు భక్తుల చేత పూజలందుకున్న వినాయకుడు రేపు గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఒక రోజు మాత్రమే మిగిలి ఉండడంతో నిమజ్జన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. నిమజ్జనం కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. శోభాయాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా 4 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో 40 క్రేన్‌లు, గ్రేటర్‌లోని అన్ని చెరువులు, కుంటల వద్ద మొత్తం 320 క్రేన్‌లను అందుబాటులో ఉంచామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ప్రతీ కేన్‌ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక అధికారి ఉండనున్నారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ట్యాంక్‌బండ్‌ పరిధిలో 32 మంది స్విమ్మర్లను సైతం అందుబాటులో ఉంచామని చెప్పారు.

CP Anjanikumar : తొలిసారి పీవీ మార్గ్ లోనూ గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : సీపీ అంజనీకుమార్

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. ఇక హుస్సేన్‌ సాగర్‌ పరిధిలో 2, 600 లైట్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు తాగునీరు అందిచేందుకు 30 లక్షల వాటర్‌ ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు. అవసరమైన ప్రాంతాలకు వాటర్‌ ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు 8 వేల 700 మంది సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో నిరంతరం విధులు నిర్వహిస్తారు.

శోభాయాత్రలో లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయి పోలీస్‌ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నిమజ్జనం సందర్భంగా భారీగా తరలిరానున్న భక్తజన సందోహం కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బస్సుల నిర్వహణ కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.