Student : పదోతరగతి బాలికపై అత్యాచారం..
15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని తమ ఫోన్లలో బంధించారు.
Student : మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లాలో దారుణం జరిగింది. 15 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోరాన్ని తమ ఫోన్లలో బంధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరికి సాయం చేసేందుకు పదవతరగతి చదువుతున్న పదేళ్ల బాలిక భోపాల్ జిల్లా బెరసియా తహసిల్ గుంగా గ్రామానికి వచ్చింది.
Read More : Saidabad : మానవ మృగం రాజు ఎక్కడ ? పట్టుకొనేందుకు 70 ప్రత్యేక టీమ్లు. 1000 పోలీసులు
ఆరోగ్యం సరిగా లేకవడంతో ఆమె సోదరి ఆసుపత్రికి వెళ్ళింది.. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. అదే సమయంలో తమ బంధువు ఉన్నడా అంటూ ఓ వ్యక్తి ఇంట్లో ప్రవేశించాడు. ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని మరో ఇద్దరినీ పిలిపించాడు. ముగ్గురు కలిసి బాలికపై అత్యాచారం చేసి ఆ ఘోరాన్ని సెల్ ఫోన్ లో బంధించారు. ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతామని బెదిరించారు.
Read More : Kerala Lovers : రెహమాన్-సజితా పెళ్లి చేసుకున్నారు
బాలిక తిరిగి తన ఇంటికి వచ్చాక తండ్రికి ఈ విషయం చెప్పింది. వెంటనే వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.