Minister KTR : రాహుల్, బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

బండి సంజయ్ తెలంగాణకు పనికొచ్చే ఒక్క మాటా మాట్లాడరని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వాళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.

Minister KTR : రాహుల్, బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Ktr

Minister KTR : కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదులు తవ్వుతామన్న బండి సంజయ్ కు సిగ్గు, శరం ఉందా అని ప్రశ్నించారు. శుక్రవారం జగిత్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. మెట్ పల్లి అర్బన్ వార్డులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ అమిత్ షా అబద్ధాలకు బాద్ షా గా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడగడానికి రాహుల్ గాంధీకి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే కులపిచ్చి పార్టీ అని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.

Minister KTR : బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ సవాల్.. ‘దమ్ముంటే గంగుల కమలాకర్ పై పోటీ చెయ్’

బండి సంజయ్ తెలంగాణకు పనికొచ్చే ఒక్క మాటా మాట్లాడరని విమర్శించారు. పసుపు బోర్డు తెస్తామని బాండ్ పేపర్ రాసిచ్చిన వాళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదు.. మనమే కేంద్రానికి ఇస్తున్నామని చెప్పారు.