Telangana : ‘రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుడు, బ్లాక్ మెయిలర్..నన్నుబెదిరించాడు..అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్..’: మంత్రి మల్లారెడ్డి

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై TRS నేత మల్లారెడ్డి సంచలన విమర్శలు చేసారు. రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తనదైశ శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ అని..బ్లాక్ మెయిలర్ అని తాను టీడీపీలో ఉన్నప్పుడు తనను నానా విధాలుగా బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆరోపించారు. ఆఖరికి తాను ఇచ్చిన డబ్బులతోన రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి చేశాడని..ఈ విషయం రేవంత్ కాదు అని చెప్పే ధైర్యం ఉందా? అంటా మల్లారెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికిలేదని అన్నారు.

Telangana : ‘రేవంత్ రెడ్డి ఓ దుర్మార్గుడు, బ్లాక్ మెయిలర్..నన్నుబెదిరించాడు..అతను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్..’: మంత్రి మల్లారెడ్డి

Malla Reddy Fire On Revanth Reddy

Malla Reddy fire On Revanth Reddy: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై TRS నేత మల్లారెడ్డి సంచలన విమర్శలు చేసారు. రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి తనదైశ శైలిలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ దొంగ అని..బ్లాక్ మెయిలర్ అని తాను టీడీపీలో ఉన్నప్పుడు తనను నానా విధాలుగా బ్లాక్ మెయిల్ చేసేవాడని ఆరోపించారు. ఆఖరికి తాను ఇచ్చిన డబ్బులతోన రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి చేశాడని..ఈ విషయం రేవంత్ కాదు అని చెప్పే ధైర్యం ఉందా? అంటా మల్లారెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ లను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికిలేదని అన్నారు.

తెలంగాణలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కొన్ని రోజుల వరకు కారు, కమలం పార్టీలు నేతలు పరస్పర ఆరోపణలు, సవాళ్లు చేసుకోగా.. ఇప్పుడు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత దూషణలతో రాజకీయ రచ్చ రచ్చ చేస్తున్నారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా జిల్లాలు తిరుగుతున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికార పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండగా.. అదే స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ నేతలు కౌంటరిస్తున్నారు. సోమవారం (మే 24,2022)జరిగిన రచ్చబండలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మరోసారి మంత్రి మల్లారెడ్డిని టార్గెట్ చేశారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు భూకబ్జాదారులని ఆరోపించారు. పేదలను బెదిరింది తక్కువ రేట్లపై భూములు కొట్టేస్తున్నారని మండిపడ్డారు.

తనపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డిపై ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. రేవంత్‌రెడ్డిని బ్లాక్ మెయిలర్ అన్నారు మల్లారెడ్డి. ఆయన నిర్వహించేది రచ్చ బండ రాదు.. బట్టేబాజ్ బండ అన్నారు. కోట్లాది రూపాయలు లంచంగా ఇచ్చి పీసీసీ పదవిని తెచ్చుకున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిది ఐరెన్ లెగ్ అని… ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాశనం చేసి బీజేపీలో చేరుతారని అన్నారు. తాను కష్టపడి పైకి వచ్చానన్న మల్లారెడ్డి.. రాజకీయాల్లోకి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డానని తెలిపారు.

టీడీపీలో పనిచేసినప్పుడు రేవంత్ రెడ్డితో అనేక కష్టాలు పడ్డానని చెప్పారు మంత్రి మల్లారెడ్డి. మల్కాజ్ గిరి టికెట్ కోసం తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. మల్కాజ్‌గిరి సీటు తనకు రాకుండా అడ్డుకునేదుకు కుట్రలు చేశాడని.. చంద్రబాబుకు అన్ని విషయాలు చెప్పి ఎంపీ సీటు తెచ్చుకుని గెలిచానని మల్లారెడ్డి తెలిపారు. డబ్బుల కోసం తనను వేధించాడని.. తనతో డీల్ కోసం మధ్యవర్తులను పెట్టారని చెప్పారు. తాను అడిగినంత ఇవ్వకపోతే కాలేజీలు క్లోజ్ చేయిస్తానని రేవంత్ రెడ్డి బెదిరించారని మల్లారెడ్డి తెలిపారు. తాను ఇచ్చిన డబ్బులతోనే రేవంత్ రెడ్డి తన బిడ్డ పెళ్లి చేశారని మంత్రి మల్లారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో యాదగిరిగుట్టలో ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని.. రేవంత్ రెడ్డి సిద్దమేనా అని సవాల్ చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తూ పబ్బం గడుపుకునే రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా బ్లాక్ మెయిల్ చేసే రోజు వస్తుందని మల్లారెడ్డి అన్నారు.

కాగా.. ‘మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడిని జైలుకు పంపిస్తాం. గుండ్లపోచంపల్లిలో పార్క్‌ను తొలగించి రోడ్లు వేశారు. రెవెన్యూ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వందలాది ఎకరాలు మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డిని జైల్లో వేస్తాం. మల్లారెడ్డి అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తాం. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారు’ అంటూ ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు అంతకు మించి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు మల్లారెడ్డి.