Modi Tour: మోదీ చెన్నై పర్యటన.. నిధులు విడుదల చేయాలని సీఎం డిమాండ్
ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో గురువారం పర్యటించారు. డీఎమ్కే అధికారం చేపట్టి, స్టాలిన్ సీఎంగా గెలిచిన తర్వాత మోదీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నైలో దాదాపు రూ.31,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు.

Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో గురువారం పర్యటించారు. డీఎమ్కే అధికారం చేపట్టి, స్టాలిన్ సీఎంగా గెలిచిన తర్వాత మోదీ చెన్నైలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా చెన్నైలో దాదాపు రూ.31,000 కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. అనంతరం జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో సీఎం స్టాలిన్తో కలిసి పాల్గొన్నారు.
Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ
ఈ సందర్భంగా తమిళ భాష, సంస్కృతికి ప్రాధాన్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘‘తమిళనాడుకు రావడం చాలా సంతోషంగా ఉంది. తమిళ ప్రజలు, సంస్కృతి, భాష అసాధారణం. తమిళ భాష, సంస్కృతిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు మా ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది. బెంగళూరు-చెన్నై ఎక్స్ప్రెస్ వే రెండు అభివృద్ధి కేంద్రాలను కలుపుతుంది. ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుంది. శ్రీలంకకు మరింత సాయం అందిస్తాం. మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇదే సభలో పాల్గొన్న తమిళనాడు సీఎం స్టాలిన్, మోదీకి పలు డిమాండ్లు చేశారు. తమిళ భాషను హిందీలాగే అధికారిక భాషగా ప్రకటించాలని కోరారు.
PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..
‘‘కేంద్ర ప్రభుత్వ ఆఫీసుల్లో, మద్రాస్ హైకోర్టులో తమిళాన్ని అధికార భాషగా చేయండి. నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి. జీఎస్టీకి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయండి. రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ది జరుగుతోంది. మా పాలనా విధానాన్ని ద్రవిడియన్ మోడల్ అంటుంటాం. అభివృద్ది, సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అభివృద్ధి పథకాల్ని కేంద్రం ప్రారంభిస్తోంది. అయితే నిధులు రావడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల చేయండి’’ అని మోదీ సమక్షంలో స్టాలిన్ కోరారు.
- Varanasi : వారణాశి నుంచి చెన్నైకి రేపు ప్రత్యేక రైలు-ఒక్కరోజు మాత్రమే
- Cordelia: విశాఖ చేరుకున్న విలాస నౌక ‘కార్డెలియా’.. సకల సౌకర్యాలతో అందుబాటులోకి
- Chennai : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- Chennai Rave Party : చెన్నైలో రేవ్ పార్టీ.. 23ఏళ్ల యువకుడి మృతిపై అనుమానాలు.. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణమా?
- M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు
1Trending Words: ట్రెండింగ్లోని ఇంగ్లీష్ పదాలు.. మీకు తెలుసా
2salman khan: ‘నీకూ అదే గతి పడుతుంది’.. అంటూ సల్మాన్ న్యాయవాదికి బెదిరింపు లేఖ
3Bhagwant Mann : పంజాబ్ సీఎం కు కాబోయే భార్య ఎవరో తెలుసా ?
4Anand Mahindra: ఆనంద్ మహీంద్రా ఎన్నారైనా.. ఈ డౌట్ ఎందుకొచ్చింది
5Google: అంకుర సంస్థలు ప్రారంభించాలనుకుంటోన్న వారికి గూగుల్ గుడ్న్యూస్
6Udaipur Killing: ఉదయ్పూర్ హత్యపై 16ఏళ్ల బాలిక ఫేస్బుక్ పోస్ట్.. చంపేస్తామంటూ బెదిరింపులు
7Kali Poster: కాళీ పోస్టర్ తర్వాత కన్యాకుమారిలో శివుడు సిగరెట్ అంటించుకుంటున్న పోస్టర్
8MLA Angada Kanhar : ఏజ్.. జస్ట్ నెంబర్ మాత్రమే.. 58ఏళ్ల వయసులో టెన్త్ పాసైన ఎమ్మెల్యే
9Booster Dose: కొవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్ను 6నెలలకు తగ్గించిన ప్రభుత్వం
10Diginal India Scam : వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఘరానా మోసం.. రూ.30కోట్లతో జంప్
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?
-
Liger: లైగర్ @ 50 డేస్.. సందడి షురూ చేసిన పూరీ
-
Samsung Galaxy M13 : శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Sohail: లక్కీ లక్ష్మణ్ ఫస్ట్లుక్ను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!