Nandamuri BalaKrishna: కన్నీరు పెట్టుకున్న బాలయ్య.. పునీత్ మృతదేహం వద్ద భావోద్వేగం

శాండిల్‌వుడ్ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కమార్(46) చివరిచూపు కోసం నందమూరి బాలకృష్ణ కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు.

Nandamuri BalaKrishna: కన్నీరు పెట్టుకున్న బాలయ్య.. పునీత్ మృతదేహం వద్ద భావోద్వేగం

Balakrishna

Nandamuri BalaKrishna: శాండిల్‌వుడ్ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కమార్(46) చివరిచూపు కోసం నందమూరి బాలకృష్ణ కంఠీరవ స్టేడియంకు చేరుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ మృతదేహాన్ని చూడగానే బాలయ్య కన్నీరుపెట్టుకున్నారు. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్‌ను ఓదారుస్తూ కన్నీరు పెట్టుకున్న నందమూరి బాలకృష్ణ.. కాసేపు అక్కడే ఉండిపోయారు.

ఈ సమయంలో బాలయ్యతో నిర్మాత సాయి కొర్రపాటి, హీరో అర్జున్ ప్రభుదేవాతో సహా పలువురు సినిమా సెలబ్రిటీలు ఉన్నారు. ఈ సమయంలో బాలయ్య తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పునీత్ రాజ్‌కుమార్ కుటుంబంతో బాలయ్యకు మంచి అనుబంధం ఉంది.

నందమూరి బాలకృష్ణ అంటే పునీత్‌ రాజ్‌కుమార్‌కి ఎంతో అభిమానం. గతంలో కర్ణాటకలో జరిగిన ఓ వేడుకకు బాలకృష్ణ హాజరవగా.. ఆ సమయంలో వారిద్దరి మధ్య అనుబంధంకి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అయ్యింది. బాలకృష్ణ ముఖానికి ఏదో అంటుకుంటే గుర్తించిన పునీత్‌ రాజ్‌కుమార్‌ దానిని శుభ్రం చేశారు. ఆ వీడియో ఈ సమయంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.