Nayanthara – Vignesh: క్షమాపణలు చెప్పిన కొత్త జంట నయనతార- విఘ్నేశ్

కొత్త జంట నయనతార - విఘ్నశ్ శివన్ క్షమాపణలు చెప్తున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంలో భాగంగా అయిన కాంట్రవర్సీ గురించి క్షమాపణలు చెప్తున్నారు. గుడి ప్రాంగణంలో బూట్లు వేసుకుని ఫొటో షూట్స్ లో పాల్గొన్నారనే అంశంపై లీగల్ నోటీస్ ఎదుర్కొన్నారు.

Nayanthara – Vignesh: క్షమాపణలు చెప్పిన కొత్త జంట నయనతార- విఘ్నేశ్

Nayan Vignesh (1)

 

 

Nayanthara – Vignesh: కొత్త జంట నయనతార – విఘ్నశ్ శివన్ క్షమాపణలు చెప్తున్నారు. తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనంలో భాగంగా అయిన కాంట్రవర్సీ గురించి క్షమాపణలు చెప్తున్నారు. గుడి ప్రాంగణంలో బూట్లు వేసుకుని ఫొటో షూట్స్ లో పాల్గొన్నారనే అంశంపై లీగల్ నోటీస్ ఎదుర్కొన్నారు.

ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు వీరిద్దరు. దీంతో విఘ్నేశ్ శివన్ క్షమాపణ కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు లెటర్ రాశారు.

“అందరికీ చెప్పాలనుకున్నదేంటంటే, మేం తిరుపతిలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కొన్ని కారణాల రీత్యా అది కుదరక చెన్నైలోనే వివాహం చేసుకున్నాం. వివాహ వేడుక నుంచి స్వామి ఆశీర్వాదం తీసుకునేందుకు నేరుగా తిరుపతికే వచ్చాం. దర్శనం బాగా జరిగింది. గుడి బయట నిలబడి ఫొటో తీసుకోవాలనుకున్నాం. పెళ్లి పూర్తి అయిందని.. ఈ రోజు గుర్తుండిపోయేలా ఫొటో తీసుకునేందుకు ప్రయత్నించాం. గుంపు ఎక్కువ అవుతుండటంతో ఆ పరిసరాల నుంచి దూరంగా వచ్చాం”

Read Also : నయనతార-విగ్నేష్ శివన్ రిసెప్షన్ ఫోటోలు

“భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పుడు మళ్లీ ఎంటర్ అయి చెప్పులతోనే వెంటనే ఫొటో తీసుకుని వచ్చేశాం. దేవుడిపై నమ్మకంతో గుళ్లకు రెగ్యూలర్ గా వెళ్లేవాళ్లే దంపతులమే. 30రోజులుగా తిరుమలకు దాదాపు 5సార్లు వెళ్లాం”

“జరిగిన ఘటనను అవమానంగా భావిస్తున్న వారి నుంచి క్షమాపణలు కోరుతున్నాం. ఈ ప్రత్యేక రోజున ప్రతి ఒక్కరి మాకు అందిన ప్రేమ, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ” అని అందులో పేర్కొన్నారు.