Ajay Misra : కేంద్రమంత్రి మిశ్రా కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​మిశ్రాకు ఆదివారం భువనేశ్వర్​లో చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్‌ విమానాశ్రయం నుంచి కటక్‌లోని సీఐఎస్​ఎఫ్​ క్యాంపస్‌కు వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌పై

Ajay Misra : కేంద్రమంత్రి మిశ్రా కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి

Misra

Ajay Misra కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్​మిశ్రాకు ఆదివారం భువనేశ్వర్​లో చేదు అనుభవం ఎదురైంది. భువనేశ్వర్‌ లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కటక్‌లోని సీఐఎస్​ఎఫ్​ క్యాంపస్‌కు వెళ్తున్న మంత్రి కాన్వాయ్‌పై కాంగ్రెస్​ పార్టీ విద్యార్థి విభాగం(NSUI)కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు.

మంత్రి కాన్వాయ్‌ను ముందుకు పోనివ్వకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. నల్ల బ్యాడ్జ్​లను ప్రదర్శిస్తూ.. మినిస్టర్​ గో బ్యాక్​ అంటూ నినాదాలు చేశారు. మంత్రిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ ముందు నిరసనకు దిగారు.

కాగా, ఈ నెల ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది చనిపోయారు.

దీనిపై కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఒడిశాకు చేరుకున్న కేంద్రమంత్రికి కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నుంచి నిరసన సెగ తగిలింది.

ALSO READ Taliban Supreme : అజ్ణాతం వీడిన అఖుండ్‌జాదా..తొలిసారి పబ్లిక్ ముందుకు తాలిబన్ సుప్రీం లీడర్