Mumbai Airport: ఎయిర్పోర్టులో రూ.43కోట్ల విలువైన ఐఫోన్-13లు స్మగ్లింగ్
స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఐఫోన్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. వీటి మొత్తం విలువ రూ.43కోట్ల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.
Mumbai Airport: స్మగ్లింగ్కు కాదేది అనర్హం. బంగారం, వజ్రం వాటితో పాటు… అమూల్యమైనది ఏదైనా సరే తగ్గేదే లేదంటున్నారు స్మగ్లర్లు. ఈ క్రమంలోనే స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఐఫోన్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. వీటి మొత్తం విలువ రూ.43కోట్ల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.
‘డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ముంబై ఎయిర్పోర్టులో 3వేల 646 ఐఫోన్-13 స్మార్ట్ ఫోన్లను స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నాం. వాటిని నవంబర్ 26న ఇండియా నుంచి సింగపూర్ తరలిస్తుండగా తెలుసుకోగలిగాం. సీజ్ చేసిన వస్తువుల విలువ రూ.42.86 కోట్లు ఉండొచ్చని భావిస్తున్నాం’ అని డీఆర్ఐ తెలిపింది.
……………………………………………: బిగ్బాస్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్