NITI Aayog’s MPI : దేశంలో పేద రాష్ట్రాలు ఇవే..బీహార్ లో సగానికి పైగా జనాభా పేదరికంలోనే
బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసిన

NITI Aayog’s MPI : బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని పేద రాష్ట్రాలుగా అవతరించాయి. గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసన బహుముఖ పేదరిక సూచీ(MPI)పేరుతో గురువారం నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం…దేశంలో అత్యంత పేద రాష్ట్రంగా బిహార్ నిలవగా ఆ తర్వాత జార్ఘండ్, ఉత్తర్ప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
2015-16లో చేపట్టిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఆధారంగా తొలిసారి రాష్ట్రాల వారీగా పేదరిక సూచీని విడుదల చేసింది నీతి ఆయోగ్. ప్రపంచవ్యాప్తంగా అనుసరించే ఆక్స్ఫర్డ్ పావర్టీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్(OPHI), ద యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(UNDP) పద్ధతులను ఉపయోగించి భారత జాతీయ MPI(Multidimensional Poverty Index)ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం, విద్య, జీవన విధానం వంటి మూడు కీలక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపింది. అందులో పోషకాహారం, పిల్లలు, పెద్దవారి మరణాలు, పాఠశాల హాజరు, వంట గ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు, పక్కా ఇళ్లు, బ్యాంకు ఖాతాలు వంటి 12 అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.
నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం..బిహార్లో 51.91 శాతం(సగానికి పైగా జనాభా), జార్ఖండ్లో 42.16శాతం, ఉత్తర్ప్రదేశ్లో 37.79 శాతం, మధ్యప్రదేశ్లో 36.65, మేఘాలయలో 32.67శాతం మంది పేదరికంలోకి జారుకున్నారు. 13.74 శాతం మంది పేదవారితో సూచీలో 18వ స్థానంలో తెలంగాణ నిలవగా… 12.31 శాతం మందితో సూచీలో 20వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గోవాలో 3.76శాతం, సిక్కింలో 3.82శాతం, తమిళనాడులో 4.89శాతం, పంజాబ్ లో 5.59శాతం మంది పేదరికంలోకి జారుకున్నారు. ఈ రిపోర్ట్ లో చివరిస్థానంలో కేరళ నిలిచింది. పేదవారు అత్యంత తక్కువగా ఉన్న రాష్ట్రంగా కేరళ(0.71 శాతం) సూచీలో చివరిస్థానంలో నిలిచింది.
ఇక,కేంద్రపాలిత ప్రాంతాల విషయానికొస్తే…దాద్రనగర్ హవేలీ అత్యధికంగా 27.36 శాతంతో పేదరికంలో మొదటి ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత జమ్ముకశ్మీర్, లద్దాఖ్లో 12.58 శాతం, దామన్ దియూలో 6.82 శాతం, ఛండీగఢ్లో 5,97శాతం, ఢిల్లీలో 4.79శాతం, అండమాన్ నికోబార్ లో 4.30శాతం, లక్షద్వీప్లో 1.82శాతం, పుదుచ్చేరిలో 1.72శాతం మంది పేదరికంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ రిపోర్ట్ పేర్కొంది.
ALSO READ International Flights : డిసెంబర్-15 నుంచే అంతర్జాతీయ విమాన సర్వీసుల పునఃప్రారంభం
- Telangana : భూత వైద్యం పేరుతో చిత్రహింసలు..బాలికను నిప్పుల కుంపటిలో కాళ్లు పెట్టించిన వైనం
- Andhra pradesh : వైసీపీ ఎమ్మెల్సీ కారులో యువకుడి మృతదేహం కలకలం.. కాకినాడలో టెన్షన్ టెన్షన్
- Nikhat Zareen : చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి.. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్గా నిఖత్ జరీన్
- She Teams: షీ టీమ్స్కు వెల్లువెత్తిన ఫిర్యాదులు.. నిందితులపై కేసులు
- Police Recruitment: నిలిచిపోయిన పోలీస్ రిక్రూట్మెంట్ వెబ్సైట్.. ఆందోళనలో అభ్యర్థులు
1IPL2022 Chennai vs RR : అదరగొట్టిన అశ్విన్.. చెన్నైపై రాజస్తాన్ విజయం.. టాప్ 2లోకి సంజూ సేన
2Drone Delivery: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. డ్రోన్లతో కిరాణా సరుకుల డెలివరీ
3Telangana Corona Bulletin Update : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
4PawanKalyan: ఏపీలో జనసేన మీటింగ్.. మధ్యలో కరెంట్ కట్!
5MS Dhoni : ధోనీ వచ్చే సీజన్ ఆడతాడా? మిస్టర్ కూల్ ఏమన్నాడంటే?
6IPL2022 Rajasthan Vs CSK : మొయిన్ అలీ సూపర్ బ్యాటింగ్.. రాజస్తాన్ టార్గెట్ ఎంతంటే..
7Jeep Meridian SUV : 7 సీట్ సూపర్ జీప్ మెరీడియన్ ఎస్యూవీ కారు.. బుకింగ్స్ ఓపెన్..!
8Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య
9Employee Retention: జీతాలు పెంచితేనే, మరో దిక్కులేదు: ఉద్యోగులపై టెక్ సంస్థల చివరి అస్త్రం
10Centre’s notice to cab aggregators: వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఓలా, ఉబర్లకు కేంద్రం నోటీసులు
-
Akhanda: అఖండ సీక్వెల్పై పడ్డ బోయపాటి..?
-
India Vs SA : దక్షిణాఫ్రికాతో భారత్ టీ20 సిరీస్.. హర్షల్ పటేల్ దూరం..!
-
NTR30: ఎన్టీఆర్ 30 వీడియోలో ఇది గమనించారా..?
-
Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు
-
Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!
-
PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని
-
NTR30: బన్నీ వద్దంటే.. తారక్ చేస్తున్నాడా..?
-
Vande Bharat Train: 2023 ఆగష్టు నాటికి మరో 75 వందే భారత్ రైళ్లు: కేంద్ర రైల్వేశాఖ మంత్రి