Narendra Modi: పెరుగుతున్నకరోనా.. సీఎంలతో మోదీ మీటింగ్

ఈ నెల 27, బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవుతారని కేంద్రం వెల్లడించింది.

Narendra Modi: పెరుగుతున్నకరోనా.. సీఎంలతో మోదీ మీటింగ్

Narendra Modi

Narendra Modi: దేశంలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నెల 27, బుధవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవుతారని కేంద్రం వెల్లడించింది. కరోనా కేసుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తారు.

India Covid-19 : దేశంలో కొవిడ్ నాల్గో వేవ్ ముప్పు.. వరుసగా 4వరోజు పెరిగిన కరోనా కేసులు

కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ ఈ అంశంపై ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారు. దేశంలో తాజాగా 15 వేలకుపైగా కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో 4,30,54,952 కరోనా కేసులు నమోదయ్యాయి.