Prabhas: రాధేశ్యామ్ ఎఫెక్ట్.. మళ్లీ ఆ డైరెక్టర్‌కే ప్రభాస్ ఓటు..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సాహో తరువాత పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్.....

Prabhas: రాధేశ్యామ్ ఎఫెక్ట్.. మళ్లీ ఆ డైరెక్టర్‌కే ప్రభాస్ ఓటు..?

Prabhas To Do Movie Again With Rajamouli

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ ‘రాధేశ్యామ్’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. సాహో తరువాత పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీగా రాధేశ్యామ్ వస్తుండటంతో ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే రాధేశ్యామ్ రిలీజ్ తరువాత అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి.

ఈ సినిమాలోని కంటెంట్‌లో దమ్ము లేకపోడంతో రాధేశ్యామ్ చిత్రానికి ప్రేక్షకుల నుండి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ ప్రభావం చిత్ర కలెక్షన్స్‌పై పడటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజ్ కావడంతో రాధేశ్యామ్ చిత్రాన్ని థియేటర్ల నుండి తొలగించారు. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యింది. అయితే రాధేశ్యామ్ ఫెయిల్యూర్‌తో ప్రభాస్ తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Prabhas: మిర్చి కాంబో రిపీట్..?

ఈసారి ఎలాగైనా హిట్ కొట్టేందుకు ఓ మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రభాస్ చూస్తున్నాడట. ఈ క్రమంలోనే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. అయితే ఈ సినిమా తరువాత తాను ఇప్పటికే కమిట్ అయిన పాన్ ఇండియా చిత్రాలను వీలైనంత త్వరగా ముగించేయాలని చూస్తున్న ప్రభాస్, ఆ తరువాత మరోసారి తనకు కెరీర్ బెస్ట్ హిట్లు ఇచ్చిన దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అంతేగాక మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కూడా ఓ సినిమా చేసేందుకు ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

అయితే జక్కన్న తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో మనముందుకు రాగా, ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాడు రాజమౌళి. ఈ సినిమా పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్లకు పైగానే పడుతుంది. అంటే 2025 నాటికి రాజమౌళి ఫ్రీ అవుతాడని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాస్ కూడా 2025 కోసం వెయిట్ చేస్తున్నాడట.

Adipurush: విజువల్ పనుల్లో ఆదిపురుష్.. 3డీ కోసం ఫుల్ ఎఫర్ట్!

ప్రభాస్ కూడా 2025 వరకు బిజీగా ఉండనుండటంతో ఆ తరువాత మరోసారి జక్కన్నతో చేతులు కలపాలని చూస్తున్నాడట. ఈసారి బాహుబలి లాంటి హిస్టారికల్ సబ్జెక్ట్ కాకుండా మోడ్రన్ సబ్జెక్ట్‌ను తనకోసం రెడీ చేయాల్సిందిగా ప్రభాస్ జక్కన్నను కోరినట్లు తెలుస్తోంది. మరి దీనిపై జక్కన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.