Chili : మిరపలో చీడపీడల నివారణ

ఆకుల రసాన్ని పీల్చటం వలన ఆకులు క్రిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడతాయి.ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి.

Chili : మిరపలో చీడపీడల నివారణ

Chilli Cultivation

Chili : తెలుగు రాష్ట్రాల్లో పండించే అతి ముఖ్యమైన పంటల్లో మిరప పంట ఒకటి. అంతర్జాతీయంగా మిరప ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్ధానంలో ఉంది. వర్షాధారపు పంటకు నల్ల నేలలు,నీటి ఆధారపు పైరుకు నల్ల నేలలు,చల్కా నేలలు,లంక భూములు ,ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు అనుకూలం. మిర్చిసాగు రైతులు ప్రతిఏటా అనేక కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సరైన యాజమన్యపద్దతు పాటిస్తూ, సస్యరక్షణ చర్యలు చేపడితే మిరప రైతులకు లాభసాటిగా మారుతుంది. ముఖ్యంగా మిరపలో చీడపీడల విషయంలో రైతులు సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది.

మిరప పంటను ఆశించే చీడపీడలు ;

రెక్కల పురుగులు : ఈపురుగులు ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చటం వాళ్ళ ఆకుల అంచులు పైకి ముడుచు కుంటాయి.ఆకులు,పిందెలు రాగి రంగులోకి మారి పూత ,పిందె నిలిచిపోతుంది. దీని నివారణకు కార్బరిల్ 3 గ్రా లేదా ఫాసలోన్ 3 మి,లీ లేదా స్పైనోసార్ 0.25మి.లీ లీటరు నీటికి కలిపి ఆకు అడుగు భాగం బాగా తడిచేల పిచికారి చేయాలి. నాటిన 15 మరియు 45 వ రోజు ఫిప్రొనిల్ 0.3% గుళికలు ఎకరానికి 8కిలోలు చొప్పున భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు మొక్కలకు అందజేయటం ద్వారా పై ముదతను నివారించుకోవచ్చు. అంతే కాకుండా ముందు జాగ్రత్త గా ఇమిడా క్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. రసాయన,సే౦ద్రియపు ఎరువుల సమతుల్యత పాటింటం ఉత్తమం

తెల్ల నల్లి పురుగులు ; ఆకుల రసాన్ని పీల్చటం వలన ఆకులు క్రిందికి ముడుచుకొని తిరగబడిన పడవ ఆకారంలో కనబడతాయి.ఆకుల కాడలు సాగి ముదురు ఆకుపచ్చగా మారుతాయి. మొక్కల పెరుగుదల ఆగిపోయి లేత ఆకులు ముద్ద కడతాయి.దీని నివారణకు డైకోఫాల్ 5మి.లీ లేదా నీళ్ళలో కరిగే గంధకం 3గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. సింథటిక్ పైరిత్రాయిడ్ ,మందులు వాడరాదు.నత్రజని ఎరువులు తగ్గించాలి.

పేనుబంక ; పెనుబంక లేత కొమ్మల ,ఆకుల అడుగున చేరి రసాన్ని పీల్చటం వలన పెరుగుదల తగ్గుతుంది.తియ్యటి పదార్ధాన్ని విసర్జించటం వలన చీమల్ని ఆకర్షిస్తుంది. ఆకులు ,కాయలు నల్లటి నల్లటి మసిపూసి నట్లుగా మారిపోతాయి. దీని నివారణకు మిథైల్ డేమెటాన్ 2మి.లీ లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

కాయతొలచు లద్దె పురుగు ; లద్దె పురుగులు మొదటి దశ లో ఆకులను నష్ట పరచి తర్వాత కాయల్లో చేరి గింజలను తినివేస్తాయి.పంటకు విపరీథమైన నష్టం వాటిల్లుతుంది. థయోడికార్బ్ 1గ్రా.లేదా ఎసిఫేట్ 1.5 గ్రా లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మీ.లీ లేదా స్పైనోసిడ్ 0.25 మీ.లీ లేదా క్వినాల్ఫాస్ 2.0 మీ.లీ లీటరు నీటికి కలిపి అవసరంమేరకు పిచికారి చేయాలి.

విషపు ఎర ద్వారా బాగా ఎదిగిన లద్దె పురుగులను నివారించవచ్చు. దీనిని 5కిలోల తవుడు ,500 గ్రా .కార్బరిల్ లేదా 500 మీ.లీ క్లోరిపైరిఫాస్ ను 500 గ్రాముల బెల్లంతో తగినంత నీటిని కలిపి తయారు చేయాలి.ఈ విధంగా తయారు చేసిన చిన్న చిన్న గుళికలను సాయంత్రం చేనులో సమానంగా చల్లితే నెర్రెలలో దాగి ఉన్న పురుగులను రాత్రులందు బయటకు వచ్చి తినటం వలన చనిపోతాయి. కాయతొలుచు పురుగుల ఉధృతి ,ఉనికిని గుర్తించడానికి ఎకరానికి కనీసం 4 లింగాకర్షణ బుట్టలు అమర్చాలి.ఎరాలను మాత్రం 25 రోజుల కొకసారి మార్చాలి.