Rajinikanth: ‘జై భీమ్’ డైరెక్టర్‌తో తలైవా మూవీ.. ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందో..?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ లుక్ ఇప్పటికే చిత్ర యూనిట్ రివీల్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా, తాజాగా కోలీవుడ్ వర్గాల్లో రజినీకాంత్ నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఓ వార్త తాజాగా హల్‌చల్ చేస్తోంది.

Rajinikanth: ‘జై భీమ్’ డైరెక్టర్‌తో తలైవా మూవీ.. ఎలాంటి సబ్జెక్ట్‌తో వస్తుందో..?

Rajinikanth To Team Up With Jai Bheem Director TJ Gnanavel

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో రజినీకాంత్ లుక్ ఇప్పటికే చిత్ర యూనిట్ రివీల్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కాగా, తాజాగా కోలీవుడ్ వర్గాల్లో రజినీకాంత్ నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఓ వార్త తాజాగా హల్‌చల్ చేస్తోంది.

Rajinikanth : కడప దర్గాని దర్శించుకున్న కబాలి..

తమిళ స్టార్ హీరో సూర్యతో ‘జై భీమ్’ వంటి సెన్సేషనల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు టీ.జే.జ్ఞానవేల్ త్వరలోనే రజినీకాంత్‌తో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఇటీవల ఆయన రజినీకాంత్‌కు ఓ కథను వినిపించాడని.. స్టోరీలైన్ నచ్చిన రజినీ, ఈ కథను పూర్తిగా డెవెలప్ చేయమని సూచించాడట. దీంతో జ్ఞానవేల్ ప్రస్తుతం రజినీకాంత్ కోసం పూర్తి కథను రెడీ చేస్తున్నట్లుగా కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

Rajinikanth : బాలాజీని దర్శించుకున్న బాషా..

అయితే ఇటీవల ‘లవ్ టుడే’ వంటి యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కించి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ కూడా రజినీకి ఓ స్క్రిప్టును వినిపించాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ కాంబినేషన్‌కు సంబంధించి ఎలాంటి అఫీషియల్ వార్తలు రాకపోవడంతో ఈ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేయనుందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. మరి ఇప్పుడు జ్ఞానవేల్‌ తో రజినీ సినిమా తెరపైకి రావడంతో ఈ సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.