Corona Cases : దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు, 443 మరణాలు

దేశంలో కొత్తగా 10,423 కరోనా పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 3,42,96,237 కేసులు, 4,58,880 మరణాలు నమోదు అయ్యాయి.

Corona Cases : దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు, 443 మరణాలు

India Corona

corona cases and deaths : దేశంలో కొత్తగా 10,423 కరోనా పాజిటివ్ కేసులు, 443 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో ఇప్పటివరకు 3,42,96,237 కేసులు, 4,58,880 మరణాలు నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా కరోనా యక్టీవ్ కేసులు 250 రోజుల కనిష్టానికి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 1,53,776 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో యాక్టివ్ కేసులు 0.45 శాతంగా ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 15,021 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,36,83,581 మంది కోలుకున్నారు. దేశంలో మార్చి 2020 తరువాత రికవరీ కేసుల శాతం భారీగా పెరిగింది.

Voters List Draft : తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల

భారత్ లో 290 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 106.85 కోట్ల డోసుల టీకాలు అందజేశారు. నిన్న 52,39,444 డోసుల టీకాలు అందజేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 106,85,71,879 డోసుల టీకాలు అందజేశారు.