Medico Preeti : మెడికో ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

వరంగల్ మెడికో ప్రీతి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.

Medico Preeti : మెడికో ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్ గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

preeti

Medico Preeti : వరంగల్ మెడికో ప్రీతి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అంతేకాకుండా ప్రీతి మృతిపై విచారణ జరిపించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. నిన్న(ఆదివారం) రాత్రి 9.10 గంటలకు ప్రీతి మృతి చెందినట్లు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. సీనియర్లు వేధిస్తున్నారంటూ కేఎంసీంలో ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 5 రోజులుగా మృత్యువుతో పోరాడి ప్రీతి కన్నుమూసింది.

గాంధీ మార్చురీలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. హైదరాబాద్ నుంచి ప్రీతి స్వగ్రామం గర్నిగడ్డ తండాకు మృతదేహాన్ని తరలిస్తున్నారు. పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి అంత్యక్రియలు ఇవాళ (సోమవారం) జరుగనున్నాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని గర్నిగడ్డ తండాలో ప్రీతి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకముందు ప్రీతి తల్లితండ్రులు నిమ్స్ లో ప్రీతి మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించారు. పోస్టుమార్టం కోసం తరలించడాన్ని అడ్డుకున్నారు. తమ కూతురు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Medico Preethi Passes Away : మెడికో ప్రీతి కన్నుమూత.. నిమ్స్ దగ్గర ఉద్రిక్తత, భారీగా పోలీసులు మోహరింపు

హెచ్ వోడీ, ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ కూతురు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మొత్తం ఘటనపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని పట్టుబట్టారు. ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను తెలపాలని డిమాండ్ చేశారు. ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నెల 22 తెల్లవారుజాము 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అసలు ఏం జరిగిందో చెప్పాలని పట్టుబట్టారు. సీనియర్ విద్యార్థినిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ప్రీతి మృతదేహాన్ని ఎంతకూ పోస్టుమార్టానికి తరలించేందుకు అంగీకరించకపోవడంతో ప్రభుత్వం తరపున పోలీసులు చర్చలు జరిపారు. మంత్రులతో ఫోన్ లో మాట్లాడించారు. ప్రీతి కుటుంబానికి రూ.30లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రులు అంగీకరించారు. అంతేకాకుండా ప్రీతి మృతిపై విచారణ జరిపించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Medico Preeti Case: వరంగల్ వేధింపుల బాధితురాలు ప్రీతి మరణం.. కాపాడేందుకు చాలా ప్రయత్నించామన్న నిమ్స్ వైద్యులు

నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెచ్ వోడీ, ప్రిన్సిపల్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రీతి తండ్రి తెలిపారు. మంత్రి హరీశ్ రావు సైతం హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించేందుకు వారు ఒప్పుకోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రీతి బంధువులను గాంధీ ఆస్పత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. రాత్రి పోస్టుమార్టం పూర్తి అవ్వడంతో ప్రీతి మృతదేహాన్ని గిర్నితండాకు తరలిస్తున్నారు.