Sai Dharam Tej : ప్రాణాపాయం లేదు.. సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపస్మారక స్థితికి వెళ్లిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ ను జూబ్లిహిల్స్ అపోలో డాక్టర్లు విడుదల చేశారు. తేజ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు

Sai Dharam Tej : ప్రాణాపాయం లేదు.. సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

Sai Dharam Tej Health Bulletin

Sai Dharam Tej : రోడ్డు ప్రమాదంలో గాయపడి, అపస్మారక స్థితికి వెళ్లిన మెగా హీరో సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ ను జూబ్లిహిల్స్ అపోలో డాక్టర్లు విడుదల చేశారు. తేజ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పారు. తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అయితే కాలర్ బోన్ విరిగిందన్నారు. దానికి వైద్యం చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాగే 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామన్నారు. తేజ్ తప్పకుండా కోలుకుంటాడని డాక్టర్లు చెప్పారు. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. వెంటిలేటర్ పై పెట్టినంత మాత్రాన ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉదయానికి కల్లా తేజ్ మాట్లాడతాడని డాక్టర్లు స్పష్టం చేశారు.

రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గాయపడ్డాడు. తాను రైడ్ చేస్తున్న స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే షాక్ కి గురి కావడంతో సాయితేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తేజ్ ను ముందుగా హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. బైక్ పై వస్తున్న తేజ్.. బైక్ స్కిడ్ కావడంతో పడిపోయాడు. అయితే తలకు హెల్మెట్ ఉండటంతో తలకు రక్షణ లభించింది. లేదంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని పోలీసులు అన్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.

తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తేజ్ సేఫ్ గా ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. ”తేజ్ కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం సేఫ్ గా ఉన్నాడు. డాక్టర్లతో మాట్లాడాక ఫ్యామిలీ తరుఫున నేను చెబుతున్నా. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లందరితో మాట్లాడి వచ్చి నేను చెబుతున్నాను. తేజ్ ఈజ్ వెరీ సేఫ్. రేపటికి మామూలు అవుతాడని, మాట్లాడతాని డాక్టర్లు చెప్పారు. మీడియాలో రకరకాల వార్తలు రాకూడదని, అవాస్తవాలు బయటకు వెళ్లకూడదనే ఫ్యామిలీ తరుఫున నేను వచ్చి చెబుతున్నాను. హీ ఈజ్ వెరీ వెరీ సేఫ్. హెడ్ ఇంజ్యురీ కానీ, స్పైనల్ ఇంజ్యురీ కానీ ఏమీ లేవు. ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఎక్కడా లేవు అని డాక్టర్లు చెప్పారు” అని అల్లు అరవింద్ తెలిపారు.

శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో ఈ ప్రమాదం జరిగింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటాక ఐకియా వైపు వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలిపారు. తేజ్ రైడ్ చేస్తున్న బండి నెంబర్ TS07 GJ 1258. ఇది సరికొత్త బైక్. హై ఎండ్ బైక్ అని చెప్పాలి. చూడగానే ఆకట్టుకునే మోడల్. రేసింగ్ బైక్. 228 కేజీల బరువు ఉంటుంది.

బైక్ రైడింగ్ అంటే తేజ్ కు ఇష్టం. షూటింగ్ లేని సమయంలో తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా బైక్ రైడ్ చేస్తున్నాడు. కేబుల్ బ్రిడ్జి దాటాక బైక్ స్పీడ్ ని అదుపు చేయలేక కిందకు పడ్డాడు. ప్రమాదంలో గాయాలు అయ్యాయి.