Apollo : సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్

మెగా హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ తేజ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు.

Apollo : సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్

Sai Dharam

Sai Dharam Tej : మెగా హీరో, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ తేజ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు అపోలో వైద్యులు. ఇంటర్నల్ గా ఎలాంటి గాయాలు లేవని, చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని తెలిపారు. డాక్టర్ అలోక్ రంజన్ నేతృత్వంలో చికిత్స కొనసాగుతోంది. కాలర్ బోన్ శస్త్ర చికిత్స కు 24 గంటల తర్వాత…చూస్తామని వైద్యులు వెల్లడించారు.

Read More : Medicover : గోల్డెన్ అవర్‌లో తీసుకొచ్చారు…సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం తప్పింది

అపోలో ఆసుపత్రిలో చికిత్స : –
రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్‌ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. క్లోజ్ అబ్జర్వేషన్ కోసం ఈ రోజు కూడా ఐసీయూలోనే సాయి ధరమ్‌తేజ్‌ను ఉంచుతారు. మరోసారి పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాత.. మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్‌కు చాలా రకాల పరీక్షలు నిర్వహించారు. శనివారం మరికొన్ని టెస్టులు చేస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. కుడి కన్ను, ఛాతిపై బలమైన గాయాలున్నాయి. వాటికి చికిత్స అందించడంతో పాటు.. ఎప్పటికప్పుడు పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు.

Read More : Saidharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ పై రాయదుర్గం పీఎస్ లో కేసు నమోదు

నటీనటుల ఆవేదన : –
తోటి హీరోలతో ఎంతో స్నేహంగా మెదిలే సాయి ధరమ్ తేజ్.. ఇలా రోడ్డు ప్రమాదానికి గురికావడం పట్ల చాలామంది నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అపోలో ఆస్పత్రికి వీఐపీలు క్యూ కడుతున్నారు. రామ్‌చరణ్‌, ఉపాసన ఉదయాన్నే అపోలోకు వచ్చారు. ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, రాశీఖన్నాతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్‌తేజ్‌ను పరామర్శించారు. చిరంజీవి, సురేఖ, నాగబాబు, అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌లు శుక్రవారం రాత్రి అంతా అక్కడే ఉన్నారు. మరికొందరు సినీ ప్రముఖులు కూడా సాయిధరమ్‌తేజ్‌ కోలుకోవాలని ట్వీట్‌ చేశారు.

Read More : Sai Dharam Tej : ప్రాణాపాయం లేదు.. సాయిధరమ్ తేజ్ హెల్త్ బులెటిన్ విడుదల

బైక్ రైడింగ్ అంటే ఇష్టం : –
సాయి ధరమ్‌ తేజ్‌కు బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్‌గా రేసింగ్‌లకు వెళతాడు. షూటింగ్‌లకు కూడా బైక్‌పై వెళ్లడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. సాయిధరమ్‌ తేజ్‌ దగ్గర నాలుగు ఖరీదైన స్పోర్ట్స్‌ బైక్‌లు ఉన్నాయి. అందులో రెండు బహుమతిగా వచ్చినవే. మేనమామ పవన్‌కల్యాణ్‌ ఓ అవెంజర్‌బైక్‌ను కానుకగా ఇచ్చారు. తేజ్‌ తల్లి హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఓ బైక్‌ను సాయికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదానికి గురైన బైక్‌ను తేజ్‌ తనే కొన్నాడు. రెగ్యులర్‌గా ఐటీసీ కోహినూర్‌ వెనక తేజ్‌ రైడింగ్‌కు వెళ్లేవాడని తెలుస్తోంది. ప్రతిసారి హెల్మెట్‌తో పాటు బైక్‌సూట్‌, నీ ప్యాడ్స్‌ ఎప్పుడూ ధరించేవాడు.

Read More : Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం.. యాక్సిడెంట్ దృశ్యాలు విడుదల

వేగం, రోడ్డుపై మట్టి ఉండడమే కారణం : –
నటుడు సందీప్‌ కిషన్‌, వైవా హర్ష, నరేశ్‌ కుమారుడు అంతా కలసి రైడింగ్‌కు వెళ్లేవారని తెలుస్తోంది. అలాగే రెగ్యులర్‌గా వీకెండ్‌ పార్టీలకు సాయి ధరమ్‌తేజ్‌ అటెండ్‌ అయ్యేవాడని చెబుతున్నారు. నిన్నకూడా వీకెండ్ కావడంతో ఓ పార్టీకి వెళ్లడానికే బయలుదేరినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే శుక్రవారం ఒక్క హెల్మెట్‌ మాత్రమే ధరించి బైక్‌పై బయలుదేరాడు. అయితే వేగం, రోడ్డుపై మట్టి కారణంగా ప్రమాదం జరిగింది. ఒకవేళ బైక్‌ సూట్‌ వేసుకుని ఉంటే ఇంత ప్రమాదం జరిగేది కాదని చెబుతున్నారు.