Samantha : చాలా రోజుల తర్వాత జనాల్లోకి వచ్చిన సమంత.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సందడి.. ఇలా అయిపోయిందేంటి..

గత కొన్ని రోజులుగా సమంత ఇంటివద్దే ఉంటూ మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనపడటంతో సమంత ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి...............

Samantha : చాలా రోజుల తర్వాత జనాల్లోకి వచ్చిన సమంత.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సందడి.. ఇలా అయిపోయిందేంటి..

Samantha appears in mumbai airport

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని రోజులుగా అసలు బయటకే రావట్లేదు. యశోద సినిమా సమయంలో ప్రమోషన్స్ లో ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. ఆ సమయంలోనే తనకి మయోసైటిస్ వచ్చిందని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది సామ్. దీంతో అభిమానులు, ప్రేక్షకులు, ప్రముఖులు అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తనకి మయోసైటిస్ వచ్చిన దగ్గర్నుంచి అసలు బయటకి రావట్లేదు సమంత.

ఇక సోషల్ మీడియాలో కూడా అంతగా యాక్టీవ్ గా ఉండట్లేదు సమంత. తాజాగా శాకుంతలం డబ్బింగ్ స్టార్ట్ చేశాను అని ఓ పోస్ట్ పెట్టింది సామ్. అలాగే నేడు ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా సమంత ఇంటివద్దే ఉంటూ మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనపడటంతో సమంత ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Shah Rukh Khan : నెటిజెన్లు కామెంట్స్ కౌంటర్లు ఇస్తున్న షారుఖ్ ఖాన్..

ముంబై ఎయిర్ పోర్ట్ లో బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో, చేతిలో బ్యాగ్ పట్టుకొని అదరగొడుతూ స్టైల్ గా నడుస్తూ వెళ్ళిపోయింది. మాస్క్ కూడా పెట్టుకోకపోవడంతో కొంతమంది అభిమానులు ఫొటోల కోసం ఆమె వెంట పడ్డారు. అయితే సమంత చాలా రోజుల తర్వాత కనిపించడంతో కొంచెం బక్కగా అయినట్టు, ముఖంలో కూడా కళ పోయినట్టు, చాలా డల్ గా కనిపించింది. దీంతో మయోసైటిస్ తో సమంత బాగా ఎఫెక్ట్ అయిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ముంబై ఎందుకు వచ్చింది, తన వ్యాధి తగ్గిపోయిందా లేదా ఇంకా చికిత్స తీసుకుంటుందా అని అంతా ఆలోచిస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో మీడియా పలు ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్ళింది సమంత.