Samsung Galaxy F42: శాంసంగ్ నుంచి ట్రిపుల్ కెమెరాతో అద్భుతమైన ప్రొడక్ట్
ఇండియాలో శాంసంగ్ తన తొలి ఎఫ్ సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్ 42 5జీని బుధవారం లాంచ్ చేసింది. నైట్ మోడ్తో 64ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 12 బ్
Samsung Galaxy F42: ఇండియాలో శాంసంగ్ తన తొలి ఎఫ్ సిరీస్ 5జీ స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్ 42 5జీని బుధవారం లాంచ్ చేసింది. నైట్ మోడ్తో 64ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 12 బ్యాండ్స్ 5జీ సపోర్ట్తో ఇది అందుబాటులోకి వచ్చింది. 6జీబీ, 128జీబీ మెమొరీ వేరియంట్స్తో కూడిన గెలాక్సీ ఎఫ్42 5జీ రూ.20వేల 999, రూ.22వేల 999కి లభిస్తుంది.
8జీబీ ర్యామ్ తో.. ఆండ్రాయిడ్ 11, ఒన్ యూఐ 3.1టెక్నాలజీతో నడుస్తుంది. ఈ ఫోన్ కు 64ఎంపీ ప్రైమరీ సెన్సార్ తో పాటు, 5ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ లతో ఉంది. రేర్ కెమెరాతో హైపర్ ల్యాప్స్, స్లో మోషన్, ఫుడ్ మోడ్, నైట్ మోడ్, పనోరమా, ప్రో మోడ్ లు వాడుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ తో పాటుగా 15వాట్ల బండిల్డ్ ఛార్జర్ కూడా ఇస్తామని హామీ ఇస్తున్నారు.
బ్లాక్, ఆక్వా కలర్ ఆప్షన్స్లో స్మార్ట్ఫోన్ సేల్స్ అక్టోబర్ 3 ఆదివారం నుంచి స్టార్ట్ కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్స్తో పాటు శాంసంగ్ ఆన్లైన్ స్టోర్, ప్లిఫ్కార్ట్ ద్వారా ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులో ఉంటుంది.
……………………………………..: కోచ్ పదవిపై అనిల్ కుంబ్లే నిరాసక్తి.. విదేశీయుల కోసం బీసీసీఐ వెదుకులాట
ప్లిఫ్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో భాగంగా ఎఫ్42 5జీ వేరియంట్ల ఆధారంగా రూ 17వేల 999, రూ 19వేల 999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో కస్ఠమర్లు 5జీ ప్రయోజనాలను ఆస్వాదించొచ్చని శాంసంగ్ ఇండియా మొబైల్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ వివరించారు.