Sarkaru Vaari Paata: ఓటీటీలో సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?

ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు...

Sarkaru Vaari Paata: ఓటీటీలో సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?

Sarkaru Vaari Paata Locks Ott Partner

Sarkaru Vaari Paata: ఎప్పుడెప్పుడా అని మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించడటంతో ఈ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై అదిరిపోయే బజ్‌ను క్రియేట్ చేయగా, ప్రమోషన్స్‌తో ఈ బజ్‌ను రెట్టింపు చేసింది చిత్ర యూనిట్.

Sarkaru Vaari Paata : భ్రమరాంబ థియేటర్లో బెనిఫిట్ షో.. ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూసిన నమ్రత..

ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ వస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హక్కులను భారీ రేటుకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేగాక ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ ఉండబోతుందని వారు చిత్ర యూనిట్‌తో ఒప్పందం చేసుకున్నారట.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు టీ-సర్కార్ ‘స్పెషల్’ ఆఫర్!

అంటే సర్కారు వారి పాట చిత్రానికి బాక్సాఫీస్ రిజల్ట్ చాలా కీలకం కానుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రాక ఆలస్యం అవుతుంది. ఒకవేళ సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం తేడా కొట్టినా, కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో ప్రత్యక్షమవుతుందని తెలుస్తోంది. మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాయి.