Aaditya Thackeray: చిన్న పిల్లాడు, అంత మెచ్యూరిటీ లేదు.. ఆదిత్య థాకరే ఛాలెంజ్‭పై షిండే సేన

శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ముంబైలో బాగా పట్టున్న శివసేన ఇప్పుడు రెండుగా చీలడంతో, ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందోనని చర్చలు సాగుతున్నాయి

Aaditya Thackeray: చిన్న పిల్లాడు, అంత మెచ్యూరిటీ లేదు.. ఆదిత్య థాకరే ఛాలెంజ్‭పై షిండే సేన

Sena’s Shinde faction responds to Aaditya Thackeray’s challenge to CM

Aaditya Thackeray: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండేకు మాజీ మంత్రి, శివసేన (ఉద్ధవ్ వర్గం) కీలక నేత ఆదిత్య థాకరే చేసిన ఛాలెంజ్ పరిపక్వత లేని వ్యాఖ్యలని షిండే సేన కొట్టిపారేసింది. ఎప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వాలో కూడా తెలియని పిల్లాడు ఆదిత్య అని, అలాంటి వ్యక్తి చేసే ఛాలెంజ్ పరిగణలోకి తీసుకోవాల్సి అవసరం లేదని షిండే సేన ఎమ్మెల్యే మంగేష్ కుడాల్కర్ అన్నారు. షిండే ప్రభుత్వం ప్రజల కోసం చాలా పని చేస్తోందని, ఆదిత్య చేసే ఆరోపణలు పనిగట్టుకుని చేసే తప్పుడు ప్రచారమని కుడాల్కర్ అన్నారు.

Supreme Court: న్యాయవ్యవస్థ కొత్తగా ముందుకు రావాలి.. సింగపూర్‌ చీఫ్‌ జస్టిస్‌ సుందరేశ్‌ మేనన్‌

ఇక ముంబైలో శనివారం మీడియాతో ఆదిత్య థాకరే మాట్లాడుతూ ‘‘రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండేకు నేన్ సవాల్ విసురుతున్నాను. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో నామీద పోటీ చెయ్. నా సీటు నుంచి నేను ఇప్పుడే రాజీనామా చేస్తాను. నువ్వు రాజీనామా చెయ్. ఇద్దరం కలిసి ఒకే చోట పోటీ చేద్దాం. వోర్లీ నుంచి అయినా మరో చోట నుంచి అయినా పోటీకి నేను రెడీ’’ అని ఆదిత్య థాకరే అన్నారు.

Asaduddin Owaisi: యోగి ‘హిందుత్వ’ వ్యాఖ్యలపై మండిపడ్డ ఓవైసీ.. రాజ్యాంగ ప్రమాణం గుర్తుంచుకోవాలంటూ హితవు

శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాలు తరుచూ బాహాబాహీకి వెళ్తున్నాయి. ఇక ఇరు వర్గాల మధ్య వైరం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదిత్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాగే బీఎంసీకి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ముంబైలో బాగా పట్టున్న శివసేన ఇప్పుడు రెండుగా చీలడంతో, ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందోనని చర్చలు సాగుతున్నాయి. అలాగే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.