Omicron In India : దేశంలో 422కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించినట్టు తెలిపింది. దేశంలో డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది.
Seven new Omicron cases in India : భారత్ లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ కేసుల పెరుగుతోంది. ఇవాళ కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో భారత్ లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 422కు చేరింది. ఇప్పటివరకు 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కొత్త వేరియంట్ బారి నుంచి 130 మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
దేశంలో ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించినట్టు తెలిపింది. ప్రస్తుతం దేశంలో డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నప్పటికీ… ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు వేరియంట్ కట్టడిపై ఫోకస్ పెట్టాయి.
Corona In France : ఫ్రాన్స్ లో కరోనా విలయ తాండవం.. ఒక్కరోజే లక్ష కేసులు నమోదు
మరోవైపు దేశంలో కొత్తగా 6,987 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 162 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో ప్రస్తుతం 76,766 యాక్టివ్ కేసులు, 4,79,682 మరణాలు సంభవించాయి.
ప్రపంచదేశాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. 108 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. ఇప్పటివరకు సుమారు లక్షన్నర మందికి ఈ వేరియంట్ సోకినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్క యూకేలోనే 90 వేల కేసులు నమోదు అయ్యాయి. డెన్మార్క్లో మరో 30 వేలమంది దీని బారినపడ్డారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్తో 26మంది మృతి చెందారు.