Omicron Victims Recover : మహారాష్ట్రలో కోలుకుంటున్న ఒమిక్రాన్ బాధితులు..ఆస్పత్రి నుంచి ఏడుగురు డిశ్చార్జ్

మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ నుంచి కోలుకున్న ఏడుగురు రోగులు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Omicron Victims Recover : మహారాష్ట్రలో కోలుకుంటున్న ఒమిక్రాన్ బాధితులు..ఆస్పత్రి నుంచి ఏడుగురు డిశ్చార్జ్

Omicron

Seven Omicron victims recover : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసును గుర్తించారు. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 33కు చేరింది. అయతే మహారాష్ట్రంలో అత్యధికంగా 17 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం గమనార్హం.

మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ బాధితులు క్రమంగా కోలుకుంటున్నారు. ఒమిక్రాన్ నుంచి ఏడుగురు రోగులు కోలుకున్నారు. వారందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో ఇటీవలే ఏడాదిన్నర చిన్నారి ఒమిక్రాన్ సోకిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో చిన్నారికి నెగెటివ్ గా తేలింది. పూర్తిగా కోలుకోవడంతో చిన్నారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

Gas Leak : తమిళనాడులోని కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్..ఒకరి మృతి
ఇటీవలే ఓ మహిళ నైజీరియా నుంచి భారత్ కు వచ్చారు. పింప్రీ చించ్వాడ్ లోని తన సోదరుడి వద్దకు ఇద్దరు కుమార్తెలతో పాటు వచ్చారు. అనంతరం వీరు అస్వస్థకు గురి కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ మహిళ…ఆమె సోదరుడు, ఇద్దరు కుమార్తెలకు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇందులో ఏడాదిన్నర చిన్నారి ఉండడం అందర్నీ షాక్ కు గురి చేసింది. తాజాగా పరీక్షల్లో చిన్నారితో పాటు నలుగురికి నెగెటివ్ రావడంతో వారిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు పింప్రీ – చించ్వాడ్ ప్రాంత ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

పొడి దగ్గు ఉన్న ఓ మహిళ తప్ప…మిగతా వారిలో ఎలాంటి లక్షణాలు లేవని, అందరూ సురక్షితంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. మరో ఇద్దరు మహిళలకు మాత్రం రిపీట్ టెస్టులోనూ ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలడంతో వారిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.

Corona In Telangana : తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు, ఒకరు మృతి

నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ధారవిలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నారు. మహారాష్ట్రలో 17 ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. పింప్రీ- చించ్వాడలో ఒమిక్రాన్‌ సోకిన నలుగురిలో ముగ్గురు భారత సంతతికి చెందిన నైజీరియా మహిళలున్నట్లు గుర్తించారు.

ఒమిక్రాన్ సోకిన ఏడుగురులో నలుగురు పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్‌ కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల్లో 50శాతానికి పైగా ఒమిక్రాన్‌ కేసులు మహారాష్ట్రలోనే రికార్డయ్యాయి. కరోనా కట్టడికి ముంబయిలో రెండ్రోజుల పాటు 144సెక్షన్‌ విధించారు.