Sreemukhi : ‘మెహర్ రమేష్’తో కలిసి ‘భీమ్లా నాయక్’ చూసిన శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి.. డైరెక్టర్ మెహర్ రమేష్ తో కలిసి 'భీమ్లా నాయక్' సినిమాని చూసింది. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో వీరిద్దరూ కలిసి సినిమా చూశారు. థియేటర్లో మెహర్ రమేష్ తో కలిసి దిగిన......

Sreemukhi : ‘మెహర్ రమేష్’తో కలిసి ‘భీమ్లా నాయక్’ చూసిన శ్రీముఖి

Mehar Ramesh

 

BHeemla Nayak :  పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమా నిన్న ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానుల కోలాహలాల మధ్య భారీ అంచనాలతో విడుదల అయిన భీమ్లా నాయక్ సినిమా భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఇక మొదటి రోజే చాలా మంది సెలబ్రిటీలు భీమ్లా నాయక్ సినిమాని చూశారు. మొదటి రోజే సినిమాని చూసి సినిమాపై ట్వీట్స్ కూడా చేశారు చాలా మంది సెలబ్రిటీలు.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ డే కలెక్షన్స్..

అయితే డైరెక్టర్ మెహర్ రమేష్, యాంకర్ శ్రీముఖితో కలిసి సినిమాకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. నిన్న యాంకర్ శ్రీముఖి.. డైరెక్టర్ మెహర్ రమేష్ తో కలిసి ‘భీమ్లా నాయక్’ సినిమాని చూసింది. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో వీరిద్దరూ కలిసి సినిమా చూశారు. థియేటర్లో మెహర్ రమేష్ తో కలిసి దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ స్టోరిలలో పోస్ట్ చేసింది శ్రీముఖి. ”గొప్ప మెమరీలను చేసుకున్నాను ఇవాళ. ‘భోళా శంకర్’ డైరెక్టర్ మెహర్ రమేష్ తో కలిసి బీమ్లా నాయక్ చూస్తున్నాను” అని పోస్ట్ చేసింది. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో వస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో శ్రీముఖి నటిస్తుంది. ఈ స్నేహంతోనే వీరిద్దరూ కలిసి నిన్న భీమ్లా నాయక్ సినిమాకు వెళ్లినట్టు తెలుస్తుంది.

 

Sreemukhi