Sudha Kongara: లేడీ డైరెక్టర్‌తో మహేష్.. ఒకే చెప్పినట్లేనా?

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ విడుదల చేయగా భారీ క్రేజ్ దక్కించుకుంది.

Sudha Kongara: లేడీ డైరెక్టర్‌తో మహేష్.. ఒకే చెప్పినట్లేనా?

Sudha Kongara Mahesh Film With Lady Director Sudha Kongara

Sudha Kongara: సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జంటగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ విడుదల చేయగా భారీ క్రేజ్ దక్కించుకుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే అక్రమాల నేపథ్యంలో నడిచే ఈ కథకు పరుశురాం కమర్షియల్ హంగులతో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేయగా హైదరాబాద్‌లో ఉగాది రోజున తాజా షెడ్యూల్ మొదలు పెట్టారు.

అయితే.. యూనిట్ సభ్యులలో ఐదు మందికి కరోనా రావడంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. పరిస్థితులు చక్కబడితే మళ్ళీ షూట్ మొదలుపెట్టనున్నారు. అయితే.. ప్రస్తుతం తోటి హీరోలందరూ రెండు మూడేసి సినిమాలు లైన్లో పెట్టగా మహేష్ కూడా తర్వాత సినిమాకు కథా చర్చలు సాగిస్తున్నాడు. ఈక్రమంలోనే సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ఖరారైంది. ఇదిలా ఉండగానే మహేష్ మరో దర్శకురాలి కథకు ఒకే చెప్పినట్లుగా తాజా సమాచారం ఒకటి ఆసక్తిగా మారింది.

మహేష్ ఒకే చెప్పిన దర్శకురాలు ఎవరో కాదు.. లేడీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సుధా కొంగర. గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుధా చాలాకాలంగా స్టార్ హీరోతో సినిమాకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ కు కథ వినిపించగా ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. నిజానికి మహేష్ రాజమౌళితో సినిమా చేయాల్సి ఉండగా దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ గ్యాప్ లో మరో సినిమాకు ప్లాన్ చేసి త్రివిక్రమ్ తో సినిమాకు సై అన్నాడు. కానీ ఇప్పుడు సుధా కొంగరకు ఒకే చెప్పడంతో సర్కారు వారి పాట తర్వాత ఏ సినిమా పట్టాలెక్కుతుందన్నది ఆసక్తిగా మారింది.