Sukumar : మహేష్ గారితో ‘వన్ నేనొక్కడ్నే’ చేసిన రోజులు ఇంకా మర్చిపోలేను

ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మహేష్ ని ఇప్పటి వరకు చూడనంత జోవియల్ గా, మాస్ గా చూశాను, చూస్తారు. పరుశురాం సూపర్. మ మ మహేశా సాంగ్.......

Sukumar : మహేష్ గారితో ‘వన్ నేనొక్కడ్నే’ చేసిన రోజులు ఇంకా మర్చిపోలేను

Sukumar

 

Sarkaru Vaari Paata :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కూడా యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఈ సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఇవాళ (మే 7న) హైదరాబాద్ యూసుఫ్‌గూడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సమక్షంలో గ్రాండ్‌గా జరిగింది.

Ramarao : ఏడు సంవత్సరాలుగా 2500 మందికి పైగా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేశాం.. మహేష్ గారి వల్లే..

 

ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో మహేష్ ని ఇప్పటి వరకు చూడనంత జోవియల్ గా, మాస్ గా చూశాను, చూస్తారు. పరుశురాం సూపర్. మ మ మహేశా సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లో ఎవరూ కూర్చోరు. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన దగ్గరినుంచి సినిమా కోసం మీలాగే ఎదురు చూస్తున్నాను. డైరెక్టర్ పరుశురాం నాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు. అతని డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మహేష్ గారితో నేను వన్ నేనొక్కడ్నే చేశా. ఆ రోజులు ఇంకా మర్చిపోలేను. డైరెక్టర్ ని బాగా చూసుకుంటారు మహేష్. మిమ్మల్ని ఇలా చూస్తేనే నాకు ఇష్టం. తమన్ కొట్టిన సాంగ్స్ అన్ని నాకు నచ్చుతాయి. ఈ సినిమాలో సాంగ్స్ అదిరిపోయాయి. చిత్ర యూనిట్ అందరికి ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది కచ్చితంగా” అని తెలిపారు.