Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బాలిక అనుమానాస్పద మృతి
మృతదేహంపై కాలిన గాయాలు కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతురాలి పేరు స్రవంతిగా గుర్తించారు పోలీసులు. ఆమె తండ్రి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
Hyderabad: మేడ్చల్ జిల్లా ఘాట్ కేసర్ లో దారుణం.. ఘాట్ కేసర్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
మృతదేహంపై కాలిన గాయాలు కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతురాలి పేరు స్రవంతిగా గుర్తించారు పోలీసులు. ఆమె తండ్రి పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
గత అర్ధరాత్రి సమయంలో బాలిక ఇంట్లోంచి వెళ్లినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే స్రవంతి ఇటీవల పదవతరగతి పాస్ అయ్యింది. అర్ధరాత్రి ఇంట్లోంచి బయటకు వెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు విష్ణు, పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాత్రి ఇంట్లోంచి వెళ్లిన స్రవంతి తెల్లారేసరికి శవంగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.