SIT On Moinabad Farm House Case : మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుపై సిట్ ఏర్పాటు .. పోలీసు కస్టడీకి ముగ్గురు నిందితులు

లంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పెను సంచలనం కలిగిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగిందని నమోదైన కేసు విషయం మరో కీలక మలుపు తీసుకుంది. ఈకేసు దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తారు.

SIT On Moinabad Farm House Case : మొయినాబాద్ ఫామ్‌హౌస్ కేసుపై సిట్ ఏర్పాటు .. పోలీసు కస్టడీకి ముగ్గురు నిందితులు

SIT On Moinabad Farm House Case

SIT On Moinabad Farm House Case : తెలంగాణలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు పెను సంచలనం కలిగిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం జరిగిందని నమోదైన కేసు విషయం మరో కీలక మలుపు తీసుకుంది. ఈకేసు దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తారు. ఈ కేసులో నిందుతులుగా ఉన్న స్వామి రామచంద్రభారతి, నందకుమార్,సింహజాజాలను మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిని చంచల్ గూడ జైలునుంచి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు ప్రత్యేక వాహనంలో భారీ బందోబస్తుతో తరలించారు. వీరు ముగ్గురిని పోలీసులు రెండు రోజులపాటు విచారించనున్నారు.

సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ బృందంలో సభ్యులుగా న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిని నియమించారు. ద‌ర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తూ హోం శాఖ కార్య‌ద‌ర్శి బుధ‌వారం సాయంత్రం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

TRS MLAs: ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’కు అదనపు భద్రత.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

మొయినాబాద్‌లోని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు ప్రయత్నించారని రామచంద్రభారతి, కోరె నందకుమార్‌, సింహయాజిలపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈకేసు తెలంగాణలో పెను సంచలన కలిగిస్తోంది. ఈ కేసును సీబీఐ లేదా హైకోర్టు ఏర్పాటుచేసే సిట్‌కు బదిలీ చేయాలని బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి రిట్‌ దాఖలు చేశారు. ముగ్గురు నిందితులు కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్‌ వేశారు. ఫోన్ల ట్యాపింగ్‌పై మరో పిటిషన్‌ దాఖలైంది. ఈ కేసులన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ జే రామచంద్రరావు కోరారు. ప్రతివాదుల తరఫు న్యాయవాది సీహెచ్‌ ప్రభాకర్‌ అభ్యంతరం చెబుతూ గడువు ఇవ్వవద్దని కోరారు. దీంతో విచారణను ధర్మాసనం నవంబర్ 18కి వాయిదా వేసింది. దర్యాప్తును సిట్ ద్వారా చేయించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నిందితులు యత్నించారని ..ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లను ఆఫర్ చేశారని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. సీబీఐ, ఈడీ కేసుల నుంచి కూడా తప్పిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిందితులు ప్రలోభపెట్టారని కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై ముందుగానే పూర్తి వివరాలు తెలియడంతో ఫామ్ హౌస్ లో సీసీ కెమెరాలు, రికార్డింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని..ఈ ముగ్గురిని బీజేపీ పక్కా ప్లాన్ తోనే రంగంలోకి దింపిందని..తమ ఎమ్మెల్యేలను రూ.100కోట్లతో కొనటానికి ప్రయత్నించిందని టీఆర్​ఎస్​ ఆరోపిస్తున్న క్రమంలో ఇదంతా ప్రగతిభవన్​ డైరెక్షన్​లో టీఆర్​ఎస్​ నడిపించిన నాటకమని బీజేపీ మండిపడింది. ఎలాంటి దర్యాప్తుకైనా తాము సిద్ధమని సవాల్​ చేసింది. ఇటువంటి పలు కీలక పరిణామాల మధ్య ముగ్గురు నిందుతులను మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల విచారణ కోసం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈక్రమంలో సిట్ దర్యాప్తుకు సంబంధించి సీపీ సీవీ ఆనంద్ చార్జ్ తీసుకోనున్నారు.

Tushar Mehta : ఫామ్‪హౌజ్ కేసు వీడియో దుమారం.. హాట్ టాపిక్‪గా మారిన తుషార్ పేరు, ఎవరీ తుషార్ మెహతా?