TRS MLAs: ‘ఆ నలుగురు ఎమ్మెల్యేల’కు అదనపు భద్రత.. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
మొయినాబాద్ ఫామ్హౌజ్ కేసులో కీలకంగా ఉన్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
TRS MLAs: ఫామ్హౌజ్ కొనుగోలు కేసులో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు అదనపు భద్రత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డికి మంత్రిస్థాయి భద్రత కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
Chinese Rocket: చైనా రాకెట్ కూలుతుందన్న భయం.. స్పెయిన్లో ఎయిర్పోర్టుల మూసివేత
ఈ నలుగురికీ 4+4 గన్మెన్లను ఇస్తూ రాష్ట్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే హైదరాబాద్లోని నివాసంతోపాటు, సొంత నియోజకవర్గంలోనూ భద్రత కల్పిస్తారు. దీంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా ఏర్పాటు చేస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఈ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తుండగా, సైబరాబాద్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారు, మొయినాబాద్ ఫామ్హౌజ్లో ఈ వ్యవహారం నడుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.
ఈ నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్ల చొప్పున రూ.400 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని మీడియేటర్లు చెప్పారు. మరోవైపు ఈ కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన వీడియోను తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రం మీడియాకు విడుదల చేశారు.