PM With Warangal Chai Wala : వరంగల్ ఛాయ్ వాలాకు ప్రధాని నుంచి ఫోన్..మాట్లాడటానికి రెడీగా ఉండు..

వరంగల్ జిల్లాకు చెందిన టీ స్టాల్ యజమయాని మహ్మాద్ పాషా కు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ప్రధాని మోడీ నీతో మాట్లాడతారు రెడీగా ఉండు అని చెప్పటంతో షాక్ అయ్యాడు చాయ్ వాలా మహ్మద్ పాషా.

PM With Warangal Chai Wala : వరంగల్ ఛాయ్ వాలాకు ప్రధాని నుంచి ఫోన్..మాట్లాడటానికి రెడీగా ఉండు..

Pm With Warangal Chai Wala

PM With Warangal Chai Wala : ఓ సాధారణ ఛాయ్ వాలాకు ఏకంగా ప్రధానమంత్రి నుంచి ఫోన్ వస్తే ఎలా ఉంటుంది ? ప్రధాని నీతో మాట్లాడతారని చెబితే ఇంకెలా ఉంటుంది?నమ్మశక్యం కాదు కదా..ఎవరో కావాలని ఆటపట్టిస్తున్నారని అనిపిస్తుంది. అలాగే అనుకున్నాడు వరంగల్ జిల్లాకు చెందిన టీ స్టాల్ యజమయాని మహ్మాద్ పాషా.

వరంగల్‌ నగరానికి చెందిన చాయ్‌వాలా మహ్మాద్ పాషాకు మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమం నుంచి పిలుపు అందింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందింది. అంతే మహ్మద్ పాషా షాక్ అయ్యాడు. జులై మొదటి వారంలో ప్రధాని మోదీతో మాట్లాడేందుకు రెడీ ఉండాలని ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ఈ విషయాన్ని వరంగల్‌ జిల్లా అధికారులు కూడా ధృవీకరించటంతో మహ్మద్ పాషా ఆనందం అంతా ఇంతా కాదు..మరి ప్రధానితో మాట్లాడటమంటే మాటలా. దీంతో అతను ఉబ్బి తబ్బిబ్బు అయిపోయాడు. ఏం మాట్లాడాలి? అని అనుకుంటున్నాడు.

మహ్మద్‌ పాషా ఎంజీఎం ఆస్పత్రి వద్ద 40 ఏళ్లుగా ఫుట్‌పాత్‌పై చాయ్‌ షాపు నిర్వహిస్తున్నాడు. అదే అతని కుటుంబానికి జీవనాథారంగా ఉంది. ఈ క్రమంలో గత సంవత్సరం ఆగస్టులో పీఎం ఆత్మనిర్భర్‌ పథకం ద్వారా మహ్మద్ పాషా రూ.10వేల రుణాన్ని తీసుకుని షాపు రన్ చేస్తున్నాడు. అంతేకాదు నగదుని ఆన్ లైన్ ట్రాన్సక్షన్ ద్వారా చెల్లింపులు..తీసుకోవాటాలు చేస్తున్నాడు. టీ అమ్మకాలకు..షాపుకు కావాల్సిన సరుకులు తెచ్చుకోవటానికి పాషా గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూన్నాడు.

దీంతో..ఆత్మనిర్భర్‌ ద్వారా రుణం పొందిన వీధి వ్యాపారుల్లో అతి తక్కువ మందిని మన్‌కీ బాత్‌కు ఎంపిక చేయగా..దాంట్లో పాషా పేరు ఎంపిక అయ్యింది. ఈ సందర్భంగా మహ్మద్ పాషా మాట్లాడుతూ..ప్రధానితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉందని..కానీ ఈ సంతోషంలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదని తెలిపారు. ప్రధానితో మాట్లాడటానికి సిద్ధంగా ఉండాలంటూ ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్‌ రావటం ఇప్పటికీ తాను నమ్మలేకపోతున్నానని పాషా ఉద్వేగం తెలిపారు. ప్రధాని మోదీతో మాట్లాడబోయే క్షణాల కోసం ఎదురుచూస్తున్నానంటూ ఆనందంగా తెలిపాడు చాయ్ వాలా మహ్మద్ పాషా..