Telangana Corona Cases News : తెలంగాణలో కొత్తగా 7 కరోనా కేసులు
తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రితం రోజుతో(25) పోలిస్తే కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో..(Telangana Corona Cases News)
Telangana Corona Cases News : తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రితం రోజుతో(25) పోలిస్తే కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10వేల 823 కరోనా పరీక్షలు నిర్వహించగా, ఏడు మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 72 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 327 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించ లేదు. రాష్ట్రంలో నేటి వరకు 7,91,316 కరోనా కేసులు నమోదవగా.. 7,86,878 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నేటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,111. రికవరీ రేటు 99.43శాతంగా ఉంది.
అటు దేశంలోనూ కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా 1500 దిగువనే నమోదవుతున్న కొత్త కేసులు.. తాజాగా 1200 చేరాయి. ఇక యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతుండటం మరింత ఊరట కలిగించే విషయం. నిన్న దేశవ్యాప్తంగా 5,28,021 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,260 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24 గంటల వ్యవధిలో మరో 83 మంది కోవిడ్ తో మరణించారు.(Telangana Corona Cases News)
Face Mask: మాస్కులు ఆప్షనల్.. మహారాష్ట్రతో పాటు ఢిల్లీ, బెంగాల్ కూడా
నేటివరకు దేశంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,21,264. 24 గంటల వ్యవధిలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,404. మొత్తం రికవరీల సంఖ్య 4,24,92,326. రికవరీ శాతం 98.76%. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 13,445 (0.03%). కరోనా వ్యాప్తి కట్టడి కోసం కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న పంపిణీ చేసిన టీకాల సంఖ్య 18,38,552. మొత్తం డోసుల సంఖ్య 184,52,44,856. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.(Telangana Corona Cases News)
ప్రపంపవ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్లు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొత్త వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలో మ్యుటేషన్ కారణంగా కొత్తగా పుట్టుకొస్తున్న హైబ్రిడ్ వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని మరోసారి సూచించింది. ఇప్పటివరకు XD, XE, XF అనే మూడు హైబ్రిడ్ రకాలను గుర్తించినట్లు తెలిపిన ప్రపంచ ఆరోగ్యసంస్థ.. ఎక్స్ఈ స్ట్రెయిన్ (ఒమిక్రాన్ రెండు వేరియంట్ల ఉపరకమైన హైబ్రిడ్ స్ట్రెయిన్)లో 10శాతం పెరుగుదల రేటు అధికంగా ఉన్నట్లు వెల్లడించింది.
కొత్తగా బయట పడిన కరోనా మ్యుటెంట్ ‘ఎక్స్ఈ’కి మరింత వేగంగా వ్యాపించే గుణం ఉందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. కరోనా ఒమిక్రాన్ లో ఉప రకమైన బీఏ.2 (స్టెల్త్ కరోనా)ను ఇప్పటి వరకు అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ గా పరిగణిస్తున్నారు. కానీ, దీంతో పోలిస్తే ఎక్స్ఈ రకానికి 10 శాతం ఎక్కువ వేగంతో విస్తరించే లక్షణం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
Corona 4th Wave : కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ఈ వేగంగా వ్యాపిస్తుంది- WHO
ఇప్పటికీ ఒమిక్రాన్ ఉపకరం బీఏ.2 పలు దేశాల్లో విస్తరిస్తూనే ఉంది. అమెరికాలో కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో అత్యధికం ఈ రకానివే ఉంటున్నాయి. ఎక్స్ఈ అన్నది రెండు రకాల హైబ్రిడ్ వెర్షన్. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కలసిన రూపం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ఈ కేసులు చాలా స్పల్ప స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్ఈ రకాన్ని మొదటిసారిగా 2022 జనవరి 19న బ్రిటన్ లో గుర్తించారు.(Telangana Corona Cases News)
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.02.04.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/sRgVwJ4yj7— IPRDepartment (@IPRTelangana) April 2, 2022