Collegium: కొలీజియం వ్యవస్థపై కేంద్రానికి గట్టి సమాధానం ఇచ్చిన సుప్రీం కోర్టు

ఈ విషయంలో సీనియర్‌ న్యాయ అధికారిగా అటార్నీ జనరల్‌ తనవంతు పాత్ర తప్పనిసరిగా పోషించాలి. న్యాయపరంగా ఉన్న స్థితిని ప్రభుత్వానికి వివరించాలి. చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టే తుది నిర్ణేత. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ అవన్నీ న్యాయస్థానాల సమీక్షకు లోబడి ఉండాలి. సుప్రీం నిర్దేశించిన చట్టాలను అందరూ అనుసరించాలి

Collegium: కొలీజియం వ్యవస్థపై కేంద్రానికి గట్టి సమాధానం ఇచ్చిన సుప్రీం కోర్టు

The Supreme Court gave a strong reply to the Center of the collegium system

Collegium: సుప్రీం, హైకోర్టుల్లో జడ్జిల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం వ్యవస్థ అనేది ఈ దేశం రూపొందించిన చట్టమని, దీన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదని కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం సూటిగా సమాధానం ఇచ్చింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేస్తున్న వారు కొలీజియం వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వారిని నియంత్రించాలని అటార్నీ జనరల్‌(ఏజీ) ఆర్‌.వెంకటరమణికి సూచించింది.

‘‘సుప్రీంకోర్టుకు న్యాయసమీక్ష అధికారం లేదని ప్రభుత్వంలో ఉన్నారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారే చెబుతున్నారు. రేపు రాజ్యాంగ మౌలిక స్వరూపం కూడా రాజ్యాంగంలో లేదని అంటారు. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై మాకు చాలా అభ్యంతరం ఉంది. దీనిపై నియంత్రణ పాటించాలని వారికి సలహా ఇవ్వండి’’ అని ఏజీకి ధర్మాసనం సూచించింది. ‘‘కొలీజియం రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించిన వ్యవస్థ. కొంత మందో కొన్ని వర్గాలో దీనికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రానా అది చట్టం కాకుండా పోదు. పార్లమెంటులో చేసిన చట్టాలను కూడా సమాజంలో కొన్ని వర్గాలు అంగీకరించవు. అలాగని క్షేత్రస్థాయిలో వాటి అమలును న్యాయస్థానాలు నిలిపివేయాలా?’’ అంటూ ఏజీని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

Supreme Court: సుప్రీంలో నేటి బెంచ్ ఒక బెంచ్ మార్క్.. మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం

ఏ చట్టాన్ని పాటించాలి, దేన్ని పాటించకూడదన్న విషయాన్ని సమాజంలోని వ్యక్తులకు విడిచిపెడితే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుందని సుప్రీం హెచ్చరించింది. ముందుగా ప్రస్తావించిన పేర్లను రెండు సందర్భాల్లో కొలీజియం వెనక్కితీసుకుందని, దీని ప్రకారం చూస్తే సుప్రీంకోర్టుకే స్పష్టత లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయని ఏజీ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం మండిపడింది. అలాంటి అరుదైన సందర్భాలను ఆధారంగా చేసుకొని ప్రస్తావించిన పేర్లను తప్పనిసరిగా ఆమోదించాలన్న రాజ్యాంగధర్మాసనం ఉత్తర్వులను విస్మరించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది.

‘‘ఈ విషయంలో సీనియర్‌ న్యాయ అధికారిగా అటార్నీ జనరల్‌ తనవంతు పాత్ర తప్పనిసరిగా పోషించాలి. న్యాయపరంగా ఉన్న స్థితిని ప్రభుత్వానికి వివరించాలి. చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టే తుది నిర్ణేత. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ అవన్నీ న్యాయస్థానాల సమీక్షకు లోబడి ఉండాలి. సుప్రీం నిర్దేశించిన చట్టాలను అందరూ అనుసరించాలి’’ అని ధర్మాసనం కేంద్రానికి గట్టిగానే సమాధానం చెప్పింది. అలాగే హైకోర్టుల్లో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన ప్రక్రియ గందరగోళంగా ఉందని దీన్ని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కొద్ది రోజులుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కొలీజియంపై తరుచూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్‌ సైతం ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ముందే వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.

Supreme Court: ఈసీ అనిల్ గోయెల్ నియామకం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీం ప్రశ్నల వర్షం