Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మన దగ్గర డబ్బింగ్ చేసి విడుదలై భారీ వసూళ్ళని రాబట్టేది. కానీ.. మన సినిమాలకు ఉత్తరాదిన ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. అందుకే గతంలో మన సీనియర్ హీరోలు..

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

Telugu Films

Telugu Films: ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మన దగ్గర డబ్బింగ్ చేసి విడుదలై భారీ వసూళ్ళని రాబట్టేది. కానీ.. మన సినిమాలకు ఉత్తరాదిన ఆదరణ అంతంత మాత్రంగానే ఉండేది. అందుకే గతంలో మన సీనియర్ హీరోలు బాలీవుడ్ లో చాలా ప్రయత్నాలు చేసి వదిలేశారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. మన సినిమాలకు ఉత్తరాదిన భారీ డిమాండ్ ఉంది. అందుకే మన వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలు చేసి బాలీవుడ్ లో భారీగా విడుదల చేస్తున్నారు.

Annaatthe: సిద్ శ్రీరామ్, శ్రేయ ఘోషల్.. ‘అన్నాత్తై’ నుండి మంచి మెలోడీ

ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్ పై ఇప్పుడు మన తెలుగు హీరోల సినిమాల దండయాత్ర జరగబోతుంది. ఇండియన్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆర్ఆర్ఆర్ నుండి అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా పుష్ప వరకు ఈ దండయాత్ర కొనసాగనుంది. ముందుగా డిసెంబర్ 17న పుష్ప ఈ దండయాత్రకి తెరదీస్తుండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. రష్మిక ఇప్పటికే బాలీవుడ్ క్రేజీ స్టార్ కావడంతో కూడా పుష్పకి కలిసి వచ్చే అవకాశం కానుంది.

RRR: నిర్మాతల సంప్రదింపులు.. ఆర్ఆర్ఆర్ డేట్ మారుతుందా?

ఇక, ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలతో హిందీ సీమలో కూడా భారీ అలెర్ట్ క్రియేట్ చేసిన ఆర్ఆర్ఆర్ అసలు సిసలైన పాన్ ఇండియా సినిమాగా బాలీవుడ్ ను దున్నేసేందుకు సిద్దమవగా.. ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో దగ్గరైన తారక్.. డైరెక్ట్ సినిమాలతో అక్కడ హీరోగా తెలిసిన రామ్ చరణ్ కు తోడు బాహుబలి లాంటి క్రేజీ బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినిమా సత్తా చెప్పిన రాజమౌళికి తోడు అలియా భట్, అజయ్ దేవగన్ మార్క్ ఈ సినిమాను అక్కడ తారాస్థాయికి చేర్చాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని హిందీ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Tamil Stars : అన్ని కోట్లిచ్చి టాలీవుడ్‌కి తెచ్చుకుంటున్నారా?

మరోవైపు ఇప్పటికే బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన ప్రభాస్ ఇప్పుడు అదేస్థాయిలో రాధేశ్యామ్ సినిమాతో బాలీవుడ్ లో దిగిపోతున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా రుచించకపోయినా బాలీవుడ్ అభిమానులు మాత్రం ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు చేసి పెట్టారంటే అక్కడ ప్రభాస్ స్టామినా ఏంటో తెలుసుకోవచ్చు. ఇప్పుడు రాధేశ్యామ్ లో పూజాహెగ్డే అదనపు అట్రాక్షన్ కూడా.

Telugu Star Hero’s: స్టార్ హీరోల బిజీ షెడ్యూల్స్.. ఒకటి కాగానే మరొకటి సెట్స్ మీదకి!

ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రమే కాదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఈ బాలీవుడ్ మీద దండయాత్రలో భాగం అవుతున్నాడు. బాలీవుడ్ లో పూరి జగన్నాద్ అంటే స్పెషల్ ఫోకస్ ఉంది. దీనికి తోడు కరణ్ జోహార్ లాంటి నిర్మాత తోడవడంతో పాటు.. మైక్ టైసన్ లాంటి లెజెండరీ బాక్సర్ కూడా ఈ సినిమాకు దించేయడంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా మీద స్పెషన్ ఇంట్రెస్ట్ తో ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా టార్గెట్ చేసి మన హీరోలు ఇప్పుడు బాలీవుడ్ మీద దండయాత్రకి సిద్ధమయ్యారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.