TRS plenary : కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వివిధ డిమాండ్లు
హైదరాబాద్లో నేడు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. అలాగే ప్లీనరిలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వివిధ డిమాండ్లు చేయనుంది.

TRS demands to Central Government : హైదరాబాద్లో నేడు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. హైటెక్ సిటీలోని హెచ్ఐసీసీలో ఘనంగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్లీనరీ సమావేశాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు భాగ్యనగరం మొత్తం గులాబీమయంగా మారిపోయింది. హైటెక్స్కు వెళ్లే దారులన్నీ పార్టీ నేతల కటౌట్లతో స్వాగతం పలుకుతున్నాయి.
మూడేళ్ల తర్వాత జరుగుతున్న పార్టీ పండగ కోసం ధూంధాంగా ఏర్పాట్లు చేశారు. ప్లీనరీకి ఆరున్నర వేల మందికి పైగా టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు. ముందుగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఆ తర్వాత కేసీఆర్ స్పీచ్ ఉంటుంది. ప్లీనరీ సమావేశంలో మొత్తం ఏడు తీర్మానాలను ఆమోదించనున్నారు. ప్లీనరీ కోసం ప్రత్యేకంగా సాంగ్ను కూడా రూపొందించారు. వేలాది ఫొటోలతో సీఎం కేసీఆర్ లైఫ్ హిస్టరీని ప్రదర్శిస్తారు.
TRS Plenary : టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం..పాసులు ఉంటేనే అనుమతి
అలాగే ప్లీనరిలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వివిధ డిమాండ్లు చేయనుంది. కూలల వారిగా బీసీ జనాభా లెక్కలు సేకరించాలి. అసెంబ్లీ చేసిన తీర్మానంపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదు… కేంద్రం దిగి వచ్చే వరకు టీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. బీసీలకి కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ మైనారిటీ రిజర్వేషన్ల పెంపుదల కోసం చేసిన అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి.
సమైఖ్య స్ఫూర్తి నిలబెట్టాలి. విభజన హామీలు నెరవేర్చాలి. ఐటీఐఆర్ ,బయ్యారంలో ఉక్కు ప్యాక్టరీ, వరంగల్ లో రైల్వే కోచ్ ప్యాక్టరి ఏర్పాటు చేయాలి. కాళేశ్వరం లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్స్ లో ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలి వంటి తదితర తీర్మానాలను ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నారు.
Encounter In Mulugu District : తెలంగాణలో ఎన్కౌంటర్- ముగ్గురు మావోయిస్టులు మృతి
మరోవైపు ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రజాప్రతినిధులకు పార్కింగ్ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఏకంగా 50 ఎకరాలు కేటాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వాహనాలకు ఒకచోట, కార్యకర్తల వాహనాలకు మరోచోట పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే హైటెక్స్ పరిసరాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
- Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల్లో అందుకే మంటలు.. డీఆర్డీవో నివేదికలో షాకింగ్ విషయాలు
- Sedition Act: దేశ ద్రోహం చట్టంపై కేంద్రం వైఖరిపై ఒక్క రోజు గడువు ఇచ్చిన సుప్రీం కోర్టు
- Central Govt : దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తాం..సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
- Minister gangula: ఎఫ్సీఐ తనిఖీలతో ధాన్యం కొనుగోళ్లు ఆపేందుకు కేంద్రం కుట్ర
- Central Govt : 5-12 ఏళ్ల లోపు పిల్లలకు టీకాపై నేడే కేంద్రం కీలక నిర్ణయం
1Virender Sehwag: “ఆ మ్యాచ్లు ఆడకపోతే పంత్ను పట్టించుకోరు”
2CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
3RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
4IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్కు రాజస్తాన్
5Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
6IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
7Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
9Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
10Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య