Karthika Deepotsavam : కార్తీక దీపోత్సవానికి హాజరుకండి-కర్ణాటక సిఎం ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్
కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మైని ఆ
Karthika Deepotsavam : కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 22వ తేదీ బెంగుళూరులో టీటీడీ నిర్వహిస్తున్న కార్తీక దీపోత్సవానికి హాజరు కావాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి బసవ రాజ్ బొమ్మైని ఆహ్వానించారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి తప్పకుండా హాజరవుతానని సిఎం చెప్పారు.
నిన్న తిరుపతిలో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశాల అనంతరం బసవరాజ్ బొమ్మై ఈరోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం సుబ్బారెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రికి మర్యాద పూర్వకంగా అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి టీటీడీ ధార్మిక కార్యక్రమాల గురించి అడిగారు.
ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా టీటీడీ పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం నిర్వహిస్తోందని చెప్పారు. విశాఖపట్నం సాగర తీరాన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించామని చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 19వ తేదీ తిరుపతి, 22వ తేదీ బెంగుళూరు, 29వ తేదీ విశాఖపట్నంలో భారీ ఎత్తున కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
Also Read : Bride Escaped : కొద్ది గంటల్లో ముహూర్తం-పెళ్లి కూతురు ఆదృశ్యం
గో సంరక్షణ, గో ఆధారిత వ్యవసాయం పై టీటీడీ చేస్తున్న కృషిని సుబ్బారెడ్డి,సీఎం బొమ్మైకి వివరించారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గత నెల 12వ తేదీన ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఎస్వీబీసీ కన్నడ ఛానల్ ప్రారంభించామని చైర్మన్ తెలిపారు. ఈ ప్రసారాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు.
కన్నడ చానల్ లో దాస సాహిత్య కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి బొమ్మై టీటీడీ చైర్మన్ ను కోరారు. ఇందుకు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. టీటీడీ చేపట్టిన హిందూ ధార్మిక కార్యక్రమాలను కర్ణాటక ముఖ్యమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమాలకు కర్ణాటక ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు.