Aadavallu Meeku Johaarlu: అప్పుడు వెంకీ అందుకే కాదన్నాడా?

చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీస్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్..

Aadavallu Meeku Johaarlu: అప్పుడు వెంకీ అందుకే కాదన్నాడా?

Aadavallu Meeku Johaarlu

Aadavallu Meeku Johaarlu: చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్, లక్కీస్టార్ గా చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా తిరుమల కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్సెడ్ టాక్ సొంతం చేసుకున్నా.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడం.. లేడీ ప్రేక్షకులను అట్రాక్ చేయడంతో మంచి వసూళ్లనే అందుకుంటుంది.

Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్ళంతా ఒకచోట కలిస్తే.. మేకింగ్ వీడియో!

ఈ వారంలో ఆడవాళ్లు మంచి కలెక్షన్లే రాబట్టే అవకాశం ఉండగా వచ్చే వారం మాత్రం భారీ సినిమాలు వస్తుండడంతో ఈ సినిమా పక్కకి తప్పుకోవడం ఖాయం. ఇక సినిమా టాక్ విషయంలో ఫస్ట్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి నేరేషన్ చూపించిన తిరుమల కిషోర్ సెకండాఫ్ లో మరీ సాగతీత పెంచి సీరియల్ మాదిరి చేశారనే టాక్ వినిపిస్తుంది. దీంతో రిలీజ్ కి ముందున్న హైప్ సినిమా రిలీజ్ తర్వాత తగ్గింది. కాగా.. అసలు ఈ సినిమా శర్వా కాదు విక్టరీ వెంకటేష్ చేయాల్సిన సినిమా అనే టాక్ వినిపిస్తుంది.

Aadavallu Meeku Johaarlu: కలిసొచ్చిన కామెడీనే నమ్ముకున్న శర్వా.. హిట్ కొట్టేనా?

నిజానికి తిరుమల కిషోర్ వెంకటేష్ హీరోగా నిత్యామీనన్ హీరోయిన్ గా ఓ సినిమా మొదలు పెట్టాడు. కానీ.. ఏమైందో ఏమో కానీ.. అప్పుడు వెంకీ ఆ సినిమా నుండి పక్కకి తప్పుకున్నాడు. అదే సినిమాని కిషోర్ మార్పులు చేసి శర్వానంద్ తో మొదలు పెట్టాడు. ఆరంభంలో అంతగా లేకపోయినా రానురాను ఇది భారీ హైప్ తెచ్చుకుంది. అయితే.. శర్వా కన్నా వెంకీ చేసి ఉంటే ఎలా ఉండేదని ఇప్పుడు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శర్వాతో పోల్చితే సీనియర్ హీరోగా.. లేడీ ఫాలోయింగ్ లో కూడా వెంకీ బెటర్ అయ్యేవాడని చెప్పుకుంటున్నారు. అయితే.. ఇదే లేట్ పెళ్లి కాన్సెప్ట్ తో మల్లీశ్వరి సినిమా చేశాడు వెంకీ. బహుశా అందుకే ఇది రిజెక్ట్ చేశాడేమో అనుకుంటున్నారు.