Vijayendra Prasad : ఓ వైపు రాజ్యసభకి నామినేట్.. మరో వైపు మూడు సెన్సేషనల్ కథలు..

ఎన్నో సినిమాలకి కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, భజరంగీ భాయిజాన్, ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలకు స్టోరీస్ అందించి, రైటర్ గా ఇండియా వైడ్ ఫేమస్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ తర్వాత..........

Vijayendra Prasad : ఓ వైపు రాజ్యసభకి నామినేట్.. మరో వైపు మూడు సెన్సేషనల్ కథలు..

Vijayendra Prasad

Vijayendra Prasad :  రాజమౌళి తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇక మరోపక్క తన సినిమా కథలతో బిజీగా ఉన్నారు. మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ సినిమా కథని గ్రాండ్ గా సిద్ధం చేస్తున్నారు. మరో పక్క రెండు సెన్సేషనల్ సబ్జెక్ట్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు విజయేంద్ర ప్రసాద్. ఒకటి రజాకార్ల అరాచకాల మీదయితే, ఇంకొకటి ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ బయోపిక్ మీద. ఈ మూడు సెన్సేషనల్ స్టోరీస్ పైన ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది.

ఎన్నో సినిమాలకి కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ బాహుబలి, భజరంగీ భాయిజాన్, ట్రిపుల్ ఆర్ లాంటి భారీ సినిమాలకు స్టోరీస్ అందించి, రైటర్ గా ఇండియా వైడ్ ఫేమస్ అయ్యారు. ట్రిపుల్ ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబును, పాన్ వరల్డ్ స్థాయిలో చూపించేందుకు సిద్ధమయ్యారు దర్శకధీరుడు రాజమౌళి. దానికోసం ఇప్పటికే భారీ అడ్వెంచరస్ థ్రిల్లర్ కథను సిద్ధం చేశారు విజయేంద్ర ప్రసాద్. స్టోరీ పూర్తయినప్పటికీ క్యారెక్టర్స్, ఎలివేషన్స్ పైన స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుంది.

Venkatesh : వెంకటేష్ నెక్స్ట్ సినిమా ఏంటో?? అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్..

మరో పక్క ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్ల అరాచకాలు, అక్రమాలను తనదైన శైలిలో తెరరూపం ఇచ్చేందుకు కథను సిద్ధం చేసి సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు విజయేంద్ర ప్రసాద్. రాజన్న సినిమా సమయంలో తెలంగాణ భాష, యాస, చరిత్ర పై ఫోకస్ పెట్టిన ఈ దర్శక రచయిత ఇప్పుడు తెలంగాణ చారిత్రక నేపథ్యంలో రజాకార్ల ఆకృత్యాలను కళ్లకు కట్టినట్టు చూపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

 

మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బయోపిక్ ను సిద్ధం చేస్తున్నారు. మోహన్ మధుకర్ భగవత్ ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్నారు. ఒకప్పటి బొంబాయి రాష్ట్రంలోని చంద్రపూర్ కార్హడే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 2017లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హయాంలో రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానం పొందిన ఫస్ట్ ఆర్ఎస్ఎస్ ఛీఫ్ గా గుర్తింపు పొందిన మోహన్ భగవత్ లైఫ్ స్టోరీకి తెరరూపం ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు స్టార్ రైటర్. దీంతో ఈ మూడు సంచలన కథలు రాస్తున్న విజయేంద్ర ప్రసాద్ ఇటు కథలతో బిజీగా ఉంటూనే రాజ్యసభకు నామినేట్ అవ్వడంతో అటు కూడా ఫోకస్ చేయబోతున్నారు.