Mahabubabad : చేతబడి నెపంతో మూడు కుటుంబాలు వెలి

మంత్రాలు, చేతబడి చేస్తున్నారనే నెపంతో మహబూబా‌బాద్ జిల్లాలో మూడు కుటుంబాలను  బహిష్కరించారు తండా వాసులు. జిల్లాలోని గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు చెరువు కొమ్ముతండాలో శుక్రవారం

Mahabubabad : చేతబడి నెపంతో మూడు కుటుంబాలు వెలి

Mahabubabad

Mahabubabad :  మంత్రాలు, చేతబడి చేస్తున్నారనే నెపంతో మహబూబా‌బాద్ జిల్లాలో మూడు కుటుంబాలను  బహిష్కరించారు తండా వాసులు. జిల్లాలోని గూడూరు మండలం చిన్న ఎల్లాపురం శివారు చెరువు కొమ్ముతండాలో శుక్రవారం ఈ ఘటన వెలుగుచూసింది. బాధితులు మాజీ ఎంపీటీసీ జాటోతు గంగమ్మ, గుగులోతు పూల్‌సింగ్, వీరన్నలు తెలిపిన వివరాల ప్రకారం… కొన్ని రోజుల కిందట తండా మధ్యలో బొడ్రాయి ప్రతిష్టించాలని తండావాసులంతా నిర్ణయించారు. మరో రెండ్రోజుల్లో బొడ్రాయి ప్రతిష్టాపన ఉందనగా తండా వీధులన్నీ శుభ్రం చేసే పని మొదలు పెట్టారు.

తండావాసులు అందరూ నిర్ణయించిన చోట బొడ్రాయి ప్రతిష్టించకూడదని బాధితులు ముగ్గురూ చెప్పారు. తమ మాటను వ్యతిరేకించారని తండావాసులంతా కలిసి ఆ మూడు కుటుంబాలను వెలివేశాయి. ఆకుటుంబాలు మంత్రాలు వేస్తున్నాయంటూ నిందించి, చేతబడి చేస్తున్నారనే నెపంతో,  వారితో ఎవరూ మాట్లాడ కూడదంటూ, వారి ఇళ్లు ఉండే వీధికి ఎవరూ వెళ్లకూడదని, వారు తండాలోకి రాకూడదని నిర్ణయించి దారికి అడ్డుగా ముళ్ళకంప, రాళ్లు వేశారు. వారు ఉపయోగించే బోర్‌వెల్‌ను పాడుచేశారు. దీంతో బాధిత కుటుంబీకులు రెండ్రోజుల క్రితం గూడూరు పోలీసులను ఆశ్రయించారు.
Also Read :Ukraine Russia War : యుధ్ధం కారణంగా మండుతున్న వంట నూనెల ధరలు
స్థానిక ఎస్సై సతీశ్‌గౌడ్‌ మిగిలిన తండావాసులకు నచ్చచెప్పి వచ్చారు. అయినా తండావాసులు ఆ మూడు కుటుంబాలను కలుపుకోకుండా ఈరోజు(శనివారం) బొడ్రాయి ప్రతిష్టాపన జరపాలని నిర్ణయించారు. దీంతో మానసికంగా మరింత కుంగిన బాధిత కుటుంబాలు నిన్న గ్రామ పంచాయతీ పెద్దలు, ఇతర తండా పెద్దలతో గోడు వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.