WFI chief Brij Bhushan: దమ్ముంటే తనపై పోటీ చేయమంటూ ప్రియాంక గాంధీకి రెజ్లర్ బాడీ చీఫ్ బ్రిజ్ బూషణ్ సవాల్

రెజ్లర్ల నిరసనపై మౌనంగా ఉన్న సమాజ్‭వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురించి బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ ‘‘అఖిలేష్ యాదవ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నేనేంటో అతడికి బాగా తెలుసు. అందుకే నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు ఇవ్వలేదు’’ అని బ్రిజ్ భూషణ్ అన్నారు.

WFI chief Brij Bhushan: దమ్ముంటే తనపై పోటీ చేయమంటూ ప్రియాంక గాంధీకి రెజ్లర్ బాడీ చీఫ్ బ్రిజ్ బూషణ్ సవాల్

WFI chief Brij Bhushan and Congress Leader Priyanka Gandhi Vadra

WFI chief Brij Bhushan: రెజ్లర్ల నిరసనకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా మద్దతు ఇచ్చారు. శనివారం ఉదయం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన ప్రదేశానికి వెళ్లి వారితో పాటు కాసేపు కూర్చున్నారు.రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్, సంగీతా ఫొగట్‌లతో మాట్లాడిన ప్రియాంక.. వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. ‘‘పథకాలు సాధించి దేశపు ఆడపడుచులు వస్తే మనమందరం గౌరవిస్తాం. కానీ నేడు అదే కూతుళ్లు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై కూర్చున్నా వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. అటువంటి పరిస్థితుల్లో, నిందితుడు తన పదవిని దుర్వినియోగం చేసి అటగాళ్లపై ఒత్తిడి తీసుకురాకుండా ఆ పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అతడిపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని బహిరంగ పర్చాలి’’ అని ప్రియాంక అన్నారు.

Supreme Court : విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. 6 నెలలు ఆగాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం

కాగా, ఇది జరిగిన రెండు రోజులకు ప్రియాంకకు రాజకీయ సవాల్ విసిరాడు భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ‘‘ఎక్కడి నుంచైనా సరే. ప్రియాంక గాంధీ వాద్రా నాపై చేయాలి. పోటీ చేసి గెలవాలి’’ అంటూ ఛాలెంజ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యర్థ పార్టీలే అయినప్పటికీ.. నిరసన చేస్తున్న రెజ్లర్లకు ప్రియాంక మద్దతు ఇచ్చిన అనంతరం బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ నుంచి ఈ సవాల్ రావడం చర్చనీయాంశమైంది. అంతకు ముందు రెజ్లర్ల నిరసనపై మౌనంగా ఉన్న సమాజ్‭వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురించి బ్రిజ్ భూషణ్ స్పందిస్తూ ‘‘అఖిలేష్ యాదవ్ నాకు చిన్ననాటి స్నేహితుడు. నేనేంటో అతడికి బాగా తెలుసు. అందుకే నిరసన చేస్తున్న రెజ్లర్లకు మద్దతు ఇవ్వలేదు’’ అని అన్నారు.

Minister Mallareddy: కుల రాజకీయాలు చేస్తున్నారు.. ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్

మహిళా రెజ్లర్లను భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ భూషణ్ శరణ్ లైంగికంగా వేదిస్తున్నాడని అగ్రశ్రేని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. భూషణ్ శరణ్‌పై చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేసి, అతన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు బజరంజ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ షోఘట్, ఇతరులు జంతర్ మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తున్నారు. గతంలో వీరు ఆందోళన చేపట్టగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడల శాఖల మంత్రి హామీ ఇచ్చారు. అంతేకాక, విచారణకు సంబంధించిన కమిటీని కూడా నియమించారు. అప్పుడు రెజ్లర్లు ఆందోళన విరమించారు. గత వారంరోజుల క్రితం భూషణ్ శరణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని, వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు.

Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఎన్ఆర్‭సీ’ వాగ్దానం.. మరో వివాదానికి తెరలేపిన బీజేపీ

ఇదిలాఉంటే ఏడుగురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు పిటీషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు విచారణ జరిపి ఢిల్లీ పోలీసులు, ఇతరులకు నోటీసులు జారీచేసింది. శుక్రవారంకు విచారణ వాయిదా వేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు జరిపిన విచారణలో బ్రిజ్ భూషణ్ సింగ్ పై కేసు నమోదు చేస్తామని ఢిల్లీ పోలీసుల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రుచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. వెంటనే కొద్దిగంటలకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఇదిలాఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ.. రెజ్లర్లు ఆందోళన విరమించలేదు. ఢిల్లీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేసేవరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రెజ్లర్లు తెలిపారు.