Viral News : 14 మందిలో ఎవరిని పెళ్లి చేసుకోను? సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యువతి పోస్టు
వివాహ వేదికల్లో పెళ్లి సంబంధాల కోసం వధూవరులు పేర్లు రిజిస్టర్ చేసుకుంటారు. తమకు నచ్చిన వాటిని ఎంచుకుంటారు. అయితే ఓ యువతి 14 ప్రొఫైల్స్లో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియట్లేదంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Viral News : పెళ్లి వయసు రాగానే అబ్బాయిలు, అమ్మాయిల తల్లిదండ్రులు వివాహ వేదికల్లో తమ పిల్లల వివరాలు ఇవ్వడం కామనే. తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవడం కామనే. అయితే ఓ యువతి తాను ఎంపిక చేసిన 14 ప్రొఫైల్స్లో ఎవరిని జీవిత భాగస్వామిని చేసుకోవాలో తెలియట్లేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం మాత్రం సంచలనమే. మీరు చదివింది నిజమే.
29 సంవత్సరాల యువతి ఇంటర్నెట్లో చేసిన ఓ పోస్టు సంచలనం రేపుతోంది. నెటిజన్లు చాలా ఉత్సాహంగా స్పందిస్తున్నారు. బికామ్ చదువుకున్న ఆ యువతి ప్రస్తుతం ఏ ఉద్యోగం చేయట్లేదట. ఓ ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ ద్వారా 14 మంది పురుషులతో పరిచయం జరిగిందట. అయితే వారిలో ఎవరిని చేసుకోవాలో అర్ధం కావట్లేదుట.
@TheSquind అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేయబడిన పోస్టులో ‘నా వయసు 29 సంవత్సరాలు, బీకామ్ చదువుకున్నాను. ప్రస్తుతానికి పని చేయడం లేదు. నేను మ్యాట్రిమోనీ ద్వారా 14 మంది అబ్బాయిలతో మాట్లాడుతున్నాను.. అయితే ఎవరిని ఎంచుకోవాలో అయోమయంలో ఉన్నాను’ అని పేర్కొంది. వారి జీతాలు, వారు పనిచేసే సంస్థల వివరాలు అందులో తెలిపింది. ఆమె పెట్టిన వివరాల ప్రకారం వారి ఆదాయం సంవత్సరానికి రూ.14 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ఉంది. ఇక వారంతా బైజూస్, ఫ్లిప్ కార్ట్, డెలాయిట్ మరియు TCS వంటి ప్రముఖ కంపెనీల్లో పని చేస్తున్నారు.
ఐ పోస్ట్ వైరల్గా మారడంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘డిగ్రీ పూర్తి చేసిన మీరు ఉద్యోగంలో ఎందుకు లేరని’ కొందరు ప్రశ్నించారు. ‘మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో పురుషులు కూడా చాలామంది మహిళలతో టచ్ లో ఉండటం సాధారణమని అయితే మాటల్లో వారి నిజాయితీని తెలుసుకోవాలని’ సూచించారు. ఏది ఏమైనా భాగస్వామిని ఎంచుకునే విషయంలో ఓ యువతి ధైర్యంగా నెటిజన్ల సలహా అడగటం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Most of the girls on twitter are single because some girls are talking to 14 guys at once pic.twitter.com/1fRaGzVxwm
— Squint Neon (@TheSquind) July 17, 2023