కరోనా ముందు జాగ్రత్త : సెల్ఫ్ క్వారంటైన్లో దిలీప్ కుమార్, శిఖర్ ధావన్
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంట్లోనే డాక్టర్లతో సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తనకు కరోనా వైరస్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తనకోసం ప్రత్యేకంగా కేటాయించిన ఐసోలేషన్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నట్టు సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశాడు. తనలాగే అందరూ ముందస్తు చర్యల్లో భాగంగా ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కరోనా ఎఫెక్ట్ బాలీవుడ్పై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. భారతీయ చలనచిత్ర రంగంలో బాలీవుడ్కి అతిపెద్ద మార్కెట్ ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే 750కోట్ల నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారు మూవీ ఎక్స్పర్ట్ కోమల్నాథ్. ఇప్పటికే కరోనా కారణంగా థియేటర్లు, షాపింగ్ మాల్స్ అన్నీ మూతపడ్డాయి.
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా క్వారంటైన్లో చేరాడు. జర్మనీ నుంచి భారత్ చేరుకున్న ధావన్… నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్కు వెళ్లాడు. ఢిల్లీకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ భవనంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లోని పరిశీలనలో ఉన్నారు ధావన్. అక్కడి పరిస్థితిని వివరిస్తూ వీడియో షేర్ చేసిన ధావన్ 24 గంటల పర్యవేక్షణలో ఉన్నామని.. అందరికీ పరిశుభ్రమైన గదులు కేటాయించారని చెప్పారు.
Read More : షాకింగ్ న్యూస్ : మహారాష్ట్రలో 41 కరోనా పాజిటివ్ కేసులు