మళ్లీ రచ్చ మొదలు పెట్టిన మీరా చోప్రా

  • Published By: sekhar ,Published On : July 1, 2020 / 01:53 PM IST
మళ్లీ రచ్చ మొదలు పెట్టిన మీరా చోప్రా

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి గురై వార్తల్లో నిలిచిన ‘బంగారం’ బ్యూటీ మీరా చోప్రా తాజాగా సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది.
ఇన్‌స్టా లైవ్ చాట్‌లో మీరాను ‘ఎన్టీఆర్’ గురించి ఒక్కమాటలో చెప్పమని ఓ నెటిజన్ అడిగ్గా.. దానికి ఆమె.. ‘ఆయనెవరో నాకు తెలియదు.. నేను ఆయనకు అభిమానిని కాదు’ అని కామెంట్ చేసింది. తారక్ ఫ్యాన్స్ ఆమెను ఓ ఆట ఆడుకున్నారు. దీంతో రెచ్చిపోయిన మీరా చోప్రా.. తారక్ అభిమానులపై సైబర్ క్రైమ్‌కు రిపోర్ట్ చేసింది. ఈ విషయంలో కేటీఆర్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.

Meera Chopra

ఆ వివాదం ముగిసిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు మరో వివాదానికి తెర లేపింది మీరా. ఇంతకీ అమ్మడు ఏం చేసిందయ్యా అంటే.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటోలో హాట్ హాట్‌గా దర్శనమిస్తూ.. కుర్రకారుని కవ్విస్తోంది. ‘‘ఎక్కడ నీ హృదయం ఉంటుందో అదే నీ ఇళ్లై ఉంటుంది’’ అంటూ ఆమె పోస్ట్ చేసిన ఈ హాట్ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CCBPdBdJAdc/?utm_source=ig_web_copy_link

Read:అమెజాన్ తో ప్రియాంకా చోప్రా ఫస్ట్ లుక్ టీవీ డీల్