Sunaina: రెండు రోజులుగా కనిపించకుండా పోయిన నటి.. పోలీసుల ఎంట్రీ.. ఏం జరిగిందంటే..?
కుమార్ వర్సెస్ కుమారి అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ముద్దుగుమ్మ సునయన. గత రెండు రోజులుగా కోలీవుడ్ బ్యూటీ కనిపించడం లేదని, ఆమెను ఎవరో గుర్తు తెలియని దుండగలు కిడ్నాప్ చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Sunaina Missing: ‘కుమార్ వర్సెస్ కుమారి’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ముద్దుగుమ్మ సునయన(Sunaina). అందంతో పాటు అభినయం కూడా ఉండడంతో చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల విశాల్ హీరోగా తెరకెక్కిన ‘లాఠీ’ చిత్రంలోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది.
అయితే.. గత రెండు రోజులుగా కోలీవుడ్ బ్యూటీ సునయన కనిపించడం లేదని, ఆమెను ఎవరో గుర్తు తెలియని దుండగలు కిడ్నాప్ చేశారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు కంగారు పడ్డారు. ఆమెకు ఏమైందోనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆమెను రక్షించాలంటూ ఓ ట్యాగ్ను సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు.
Koti: రాజ్ మరణంపై ఎమోషనలైన కోటి.. మేమిద్దరం విడిపోవడానికి కారణం అదే
చివరకు ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. స్పందించిన పోలీసులు వెంటనే నటి ని వెతకడం ప్రారంభించారు. చివరగా ఆమె తిరిగిన ప్రదేశాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఆమె ఇల్లు, నటించిన, నటిస్తున్న చిత్ర నిర్మాణ సంస్థలను ఆరా తీయగా అసలు విషయం తెలిసి దిమ్మదిరిగిపోయింది. నిజంగా నటి కిడ్నాప్ కాలేదని, అదంతా ఓ డ్రామా అని, కొత్త సినిమా ప్రమోషనల్లో భాగం అని తెలుసుకుని షాకైయ్యారు.
సునయన నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘రెజీనా’. ఎయిరా ప్రొడక్షన్స్ బ్యానర్పై సతీశ్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డొమిన్ సెల్వ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగానే సునయన కనిపించడం లేదంటూ ఓ ఫేక్ వీడియోను అప్లోడ్ చేశారు. దీనిపై కొందరు నెటీజన్లు మండిపడుతున్నారు. ప్రమోషన్స్ కోసం అభిమానులతో ఆడుకుంటారా..? అందరిని కంగారు పెట్టించిన నటితో పాటు చిత్ర బృందం పై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ సునయన సేఫ్గా ఉందని తెలిసి ఆమె అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.